IMD Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. జాబితా విడుదల
- పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- జాబితా విడుదల చేసిన ఐఎండీ
- తెలంగాణలోని 5 జిల్లాలకు అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా ఐఎండీ ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం 28 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలోని ఐదు జిల్లాల్లో సెప్టెంబర్ 8న భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెంలో అత్యంత భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Rape Attempt : కదులుతున్న రైలు బాత్రూంలో దివ్యాంగ మహిళపై అత్యాచారయత్నం
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ఐఎండీ ప్రకారం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉంది. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్తో సహా ఎన్సీఆర్లోని కొన్ని చోట్ల వర్షం పడవచ్చని తెలుస్తోంది. రుతుపవనాలు మరోసారి బలపడటంతో రాజస్థాన్ రాజధాని జైపూర్ సహా పలు జిల్లాల్లో శనివారం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాగల 24 గంటల్లో తూర్పు రాజస్థాన్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ రాజస్థాన్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. తూర్పు రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 8న ఉదయపూర్, అజ్మీర్, జైపూర్ డివిజన్లలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అదే విధంగా సెప్టెంబర్ 8-9 తేదీలలో కోట, అజ్మీర్, జైపూర్ డివిజన్లలోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లోని ఐదు జిల్లాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు రాహుల్
సెప్టెంబర్ 8న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జాబితాలో మణిపూర్, మిజోరాం, త్రిపుర, జార్ఖండ్లు కూడా ఉన్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల పాటు బీహార్లో రుతుపవనాలు బలమైన స్థితిలో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10 వరకు బీహార్ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: India-UAE Ties: సోమవారం భారతదేశానికి రానున్న యూఏఈ క్రౌన్ ప్రిన్స్..
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!