Heat Wave: రానున్న రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heat Wave: రానున్న రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. తూర్పు, దీపకల్ప భారతదేశంలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్ 9 వరకు ఈశాన్య ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ గంగానదీ పరివాహక ప్రాంతం, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలో ఈ రోజు, రేపు వడగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం మీదుగా వేడిగాలుల పరిస్థితులు ఇప్పటికే కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే ఏడు రోజుల్లో సబ్-హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో విస్తారంగా తేలికపాటి, మోస్తారు వర్షపాతం లేదా హిమపాతం కురుస్తుందని పేర్కొంది.
Also Read
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
Read Also: Earthquake: న్యూయార్క్-న్యూజెర్సీలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు..
వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం బుధవారం సూచించింది. ప్రత్యేకించి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉష్ణోగ్రత కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై సమీక్ష జరిపిన తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది దేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. దీనికి తగ్గట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ దాటుతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్ నినో’ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!