Maharashtra: ‘‘బాటేంగే తో కటేంగే’’.. మిత్రపక్షం అజిత్ పవార్పై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
- యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదంతో బీజేపీ కూటమిలో చిచ్చు..
- మిత్రపక్షం అజిత్ పవార్పై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
- ఆయనకు మరికొంత సమయం పడుతుందన్న ఫడ్నవీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే నాశనమైపోతాం) అనే నినాదం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ నినాదం బీజేపీ కూటమిలో కూడా చిచ్చురేపుతోంది. బీజేపీ మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న అజిత్ పవార్ ఈ నినాదాన్ని వ్యతిరేకించాడు. ఇది జార్ఖండ్, యూపీ ప్రాంతాల్లో పనిచేస్తుందని కానీ, మహారాష్ట్రలో నినాదం పనిచేయదంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. ‘‘అజిత్ పవార్ దశాబ్ధాలుగా లౌకికవాద, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నాడు. సెక్యలరిస్టులుగా పిలుచుకునే వారులో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడం సెక్యలరిజమనే వ్యక్తులతో అతను ఉన్నాడు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు అతడికి కొంత సమయం పడుతుంది’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వ్యక్తులు ప్రజల సెంటిమెంట్లు అర్థం చేసుకోలేదు, వారికి ప్రకటన యొక్క అర్థాన్ని తెలుసుకోలేరు, వారు వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు అని ఆయన అన్నారు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Narayana Murthy: ఐటీ ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేయాల్సిందే.. ఇన్ఫోసిస్ అధినేత కీలక వ్యాఖ్యలు
అజిత్ పవార్తో పాటు బీజేపీ నేతలు పంకాజా ముండే, అశోక్ చవాన్ కూడా ఈ నినాదంపై పెదవివిరిచారు. దివంగత బీజేపీ అగ్రనేత గోపీనాథ్ ముండే కుమార్తె శ్రీమతి ముండే మాట్లాడుతూ.. ‘‘తన రాజకీయాలు భిన్నమైనవని, ఒకే పార్టీకి చెందినప్పటికీ దీనికి మద్దతు ఇవ్వబోనని అన్నారు. ప్రతీ మనిషిని ఏకం చేయడమే నాయకుడి పని కాబట్టి, మేము మహారాష్ట్రకు అలాంటి టాపిక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ నినాదం ఇటీవల హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు అంతా ఐక్యంగా ఉండాలన్నదే ఆ నినాదం అర్థం, విడిపోతే నాశనం అవుతామని బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితిని గురించి వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ‘‘కులగణన’’ అనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ (కలిసి ఉంటేనే సేఫ్) అని మరో నినాదం లేవనెత్తారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!