Maharashtra: ‘‘బాటేంగే తో కటేంగే’’.. మిత్రపక్షం అజిత్ పవార్పై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
- యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదంతో బీజేపీ కూటమిలో చిచ్చు..
- మిత్రపక్షం అజిత్ పవార్పై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
- ఆయనకు మరికొంత సమయం పడుతుందన్న ఫడ్నవీస్..
Maharashtra: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే నాశనమైపోతాం) అనే నినాదం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ నినాదం బీజేపీ కూటమిలో కూడా చిచ్చురేపుతోంది. బీజేపీ మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న అజిత్ పవార్ ఈ నినాదాన్ని వ్యతిరేకించాడు. ఇది జార్ఖండ్, యూపీ ప్రాంతాల్లో పనిచేస్తుందని కానీ, మహారాష్ట్రలో నినాదం పనిచేయదంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. ‘‘అజిత్ పవార్ దశాబ్ధాలుగా లౌకికవాద, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నాడు. సెక్యలరిస్టులుగా పిలుచుకునే వారులో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడం సెక్యలరిజమనే వ్యక్తులతో అతను ఉన్నాడు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు అతడికి కొంత సమయం పడుతుంది’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వ్యక్తులు ప్రజల సెంటిమెంట్లు అర్థం చేసుకోలేదు, వారికి ప్రకటన యొక్క అర్థాన్ని తెలుసుకోలేరు, వారు వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు అని ఆయన అన్నారు.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Read Also: Narayana Murthy: ఐటీ ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేయాల్సిందే.. ఇన్ఫోసిస్ అధినేత కీలక వ్యాఖ్యలు
అజిత్ పవార్తో పాటు బీజేపీ నేతలు పంకాజా ముండే, అశోక్ చవాన్ కూడా ఈ నినాదంపై పెదవివిరిచారు. దివంగత బీజేపీ అగ్రనేత గోపీనాథ్ ముండే కుమార్తె శ్రీమతి ముండే మాట్లాడుతూ.. ‘‘తన రాజకీయాలు భిన్నమైనవని, ఒకే పార్టీకి చెందినప్పటికీ దీనికి మద్దతు ఇవ్వబోనని అన్నారు. ప్రతీ మనిషిని ఏకం చేయడమే నాయకుడి పని కాబట్టి, మేము మహారాష్ట్రకు అలాంటి టాపిక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ నినాదం ఇటీవల హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు అంతా ఐక్యంగా ఉండాలన్నదే ఆ నినాదం అర్థం, విడిపోతే నాశనం అవుతామని బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితిని గురించి వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ‘‘కులగణన’’ అనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ (కలిసి ఉంటేనే సేఫ్) అని మరో నినాదం లేవనెత్తారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!