Nuh communal clashes: నూహ్ మతఘర్షణల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం.. అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ అల్లరల్లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ హస్తం ఉందని తేలింది. విశ్వహిందూ పరిషత్ (VHP) యాత్ర తర్వాత జరిగిన హింసలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు ఉన్నాయని హర్యానా పోలీసులు వెల్లడించారు.
Read Also: Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిరోజ్ పూర్ జిర్కాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంగళవారం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు, ఈ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది కోర్టు. హింస జరిగే రోజున తాను నూహ్ లో లేనని, తనను తప్పుడు కేసులో ఇరికించారని మమ్మల్ ఆరోపించారు. తగిని ఆధారాలు దొరికిన తర్వాతనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టు తెలియజేశారు. ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మమ్మన్ ఖాన్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.
దీనికి ముందు పోలీసులు ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ కి రెండుసార్లు తమ ముందు హాజరుకావాలని సమస్లు పంపారు. జ్వరం కారణంగా పోలీసుల సమన్లకు హాజరుకాలేదు. ఐజీ స్థాయి అధికారితో కూడాని ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసేలా హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఖాన్ తరుపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఈ కేసును సిట్ కి బదిలీ చేయాలని ఆయన అభ్యర్థించారు. జూలై 31న నూహ్ లో వీహెచ్పీ తలపెట్టిన ర్యాలీలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపు నూహ్ పట్టణానికి రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడి అనంతరం హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేసింది.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!