Nuh communal clashes: నూహ్ మతఘర్షణల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం.. అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ అల్లరల్లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ హస్తం ఉందని తేలింది. విశ్వహిందూ పరిషత్ (VHP) యాత్ర తర్వాత జరిగిన హింసలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు ఉన్నాయని హర్యానా పోలీసులు వెల్లడించారు.
Read Also: Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిరోజ్ పూర్ జిర్కాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంగళవారం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు, ఈ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది కోర్టు. హింస జరిగే రోజున తాను నూహ్ లో లేనని, తనను తప్పుడు కేసులో ఇరికించారని మమ్మల్ ఆరోపించారు. తగిని ఆధారాలు దొరికిన తర్వాతనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టు తెలియజేశారు. ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మమ్మన్ ఖాన్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.
దీనికి ముందు పోలీసులు ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ కి రెండుసార్లు తమ ముందు హాజరుకావాలని సమస్లు పంపారు. జ్వరం కారణంగా పోలీసుల సమన్లకు హాజరుకాలేదు. ఐజీ స్థాయి అధికారితో కూడాని ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసేలా హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఖాన్ తరుపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఈ కేసును సిట్ కి బదిలీ చేయాలని ఆయన అభ్యర్థించారు. జూలై 31న నూహ్ లో వీహెచ్పీ తలపెట్టిన ర్యాలీలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపు నూహ్ పట్టణానికి రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడి అనంతరం హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేసింది.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!