Site icon NTV Telugu

Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..

Hardeep

Hardeep

Hardeep Singh Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ నేతపై ఎదురుదాడికి దిగారు. ‘‘తాను కొన్ని సందర్బాల్లో ప్రతినిధి బృందంలో భాగంగా మాత్రమే కలిశాను. అతడికి ఒక ఇమెయిల్ మాత్రమే చేశాను’’ అని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు ఎప్‌స్టీన్‌తో తన సంబంధాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పూర్తిగా అధికారిక, ప్రొఫెషనల్ మీటింగ్స్‌లో భాగంగా మాత్రమే ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు తెలిపారు. 2009-17 మధ్య కేవలం 3-4 మీటింగ్స్ లో పాల్గొన్నట్లు చెప్పారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

“నేను న్యూయార్క్‌లోని UNలో భారత రాయబారిగా చేరిన మే 2009 నుండి 2017లో మంత్రి అయ్యే వరకు మూడు మిలియన్ల ఈమెయిల్‌లు విడుదలయ్యాయి. ఈ కాలంలో, మూడు లేదా నాలుగు సమావేశాల గురించి మాత్రమే ప్రస్తావనలు ఉన్నాయి. నా సంభాషణలు పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉన్నాయి, ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ మల్టీలేటరలిజం , ఇతర అంతర్జాతీయ పనులకు సంబంధించినవి” అని పూరి వెల్లడించారు. 8 ఏళ్ల కాలంలో కేవలం ఒక ఈమెయిల్ మాత్రమే ఎప్‌స్టీన్‌లో పంచుకున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ శాంతి సంస్థ (IPI) ప్రతినిధి బృందంలో భాగంగా తాను ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ.. ఎప్‌స్టీన్ పైల్స్ తీవ్రమైన నేరాలు, పిల్లలపై లైంగిక దాడులు, సెక్స్ ట్రాఫికింగ్ కేసులు సంబంధిత డేటా అని, తాను పాల్గొన్న మీటింగ్స్‌కు వీటిలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2014లో తాను ఎప్‌స్టీన్‌కు పంపిన మెయిల్‌లో కేవలం భారత డిజిటల్ ఎకానమీ అవకాశాల గురించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. సెక్స్ ట్రాఫికింగ్ లో నిందితుడిగా ఉన్న జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

Exit mobile version