Mamata Banerjee: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిపై వేధింపులు.. మమతా బెనర్జీ ఆగ్రహం!
- వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు..
- బెంగాలీల ఆత్మగౌరవం అనే అంశాన్ని రగిలించిన మమతా బెనర్జీ..
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిపై వేధింపులు: సీఎం మమతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: 2026 ఎన్నికలలో దూకుడు మీదున్న బీజేపీని ఎదుర్కోవడానికి బెంగాలీల ఆత్మగౌరవం అనే భావోద్వేగ అంశాన్ని టీఎంసీ మళ్లీ రగిలించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు బెంగాల్ కి చెందిన పౌరులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని టీఎంసీ ఆరోపించింది. ఇందులో భాగంగానే, కమలం పార్టీకి వ్యతిరేకంగా వర్షం కురిసినప్పటికీ కోల్కతా నడిబొడ్డున సుమారు 3 కిలోమీటర్ల పొడవునా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీతో సహా అధికార తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అలాగే, బెంగాలీ ప్రజల పట్ల ఆ ( బీజేపీ పాలిత) రాష్ట్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై సిగ్గుపడాలి అని మండిపడింది.
Read Also: US: సోర్ట్లో ఖరీదైన వస్తువులు దొంగతనం.. భారతీయ మహిళ అరెస్ట్
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
అయితే, ఒడిశాలోని ఝార్సుగూడలో 444 మంది అనుమానిత బంగ్లాదేశ్ జాతీయులను ఇటీవల అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర నిరసనకు దారి తీసింది. వారిలో 200 మంది బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అలాగే, ఢిల్లీలో కూడా బెంగాల్ వాసుల బహిష్కరణ డ్రైవ్లు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు బయటకు వస్తున్నాయని బీజేపీపై టీఎంసీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కాగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పశ్చిమ బెంగాల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని పలు రాష్ట్రాల్లో బెంగాల్ పౌరులపై వేధింపుల అంశాన్ని తెర పైకి తీసుకొచ్చింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!