Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతి ఇచ్చిన వారణాసి కోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రముఖంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్ట్ లో విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్ట్ విచారణ జరిపింది. సర్వే చేయాలని కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించింది. కమిషన్ మే 17 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుపున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. కోర్ట్ కమిషనర్ ను తొలగించేందుకు కోర్ట్ నిరాకరించింది.
జ్ఞానవాపి మసీదు లోపలి భాగాలను కూడా సర్వే చేయవచ్చా..? అనే పిటిషన్ ను విచారించిన కోర్ట్ మసీదులోని నేలమాళిగలతో పాటు మొత్తం ప్రాంతాన్ని సర్వే చేసి వీడియో చిత్రీకరించాలని తీర్పు చెప్పింది. అజయ్ మిశ్రాతో పాటు రెండో కోర్ట్ కమిషనర్ గా విశాల్ కుమార్ సింగ్ ను కోర్ట్ నియమించింది. కాగా గత శుక్రవారం కోర్ట నియమించిన కమిటీ మసీదు ప్రాంగణాల్లో సర్వే, వీడియోను తీయకుండా మసీదు అడ్మినిస్ట్రేషన్ కమిటీ సర్వే టీం ను లోపలకి రాకుండా అడ్డుకుంది. నిరసనలు తెలియజేసింది.
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
మొగల్ చక్రవర్తుల హయాంలో జౌరంగజేబు సమయంలో జ్ఞానవాపి శివాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందుకు అనుగుణంగానే మసీదు వెనకాల దేవాలయానికి సంబంధించి స్తంబాలు ఉండటంతో హిందువులు దేవాలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని ఆరోపిస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు మసీదును హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని… తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీకి వారణాసి కోర్ట్ ఆదేశించింది. దీంట్లో భాగంగానే సర్వేను కొనసాగించాలని వారణాసి కోర్ట్ తీర్పు చెప్పింది.
తాజావార్తలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!