Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గురువారం జ్ఞానవాపి మసీదు పై వారణాసి కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. మసీదును సర్వే చేయాలని తీర్పు వెల్లడించింది. దీనికి కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించారు. మసీదు లోపలి భాగాలను సర్వే చేయాలని కోర్ట్ ఆదేశించింది. పూర్తిగా వీడియోగ్రఫీ చేసి మే 17 వరకు నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. ఓ వర్గం వారు వీడియోగ్రఫీని ఆపాలని పిటిషన్ వేయగా… కోర్ట్ మాత్రం సర్వేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Also Read
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
- Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
- Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్లో ఫొటోలు పోస్ట్
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వర్గం వారు మసీదులో సర్వే చేయడాన్ని వ్యతిరేఖిస్తుండగా… మరో వర్గం వారు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని.. ఇప్పటికీ మసీదులో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయని.. తమకు ఆ మసీదును అప్పగించాలని కోరతున్నారు. ఈ నేపథ్యంలో కోర్ట్ వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మొగల్ చక్రవర్తుల పాలన సమయంలో ఔరంగబేబు జ్ఞానవాపి ఆలయాన్ని మసీదుగా మార్చారని వాదనలు ఉన్నాయి. అయితే ఇందుకు నిజం చేకూర్చే విధంగా మసీదు వెనకభాగంలో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నట్లుగా మరోవర్గం వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేపై ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే బాబ్రీని కోల్పోయాం…మరో మసీదును కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. వారణాసి కోర్ట్ తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా ఉందని విమర్శించారు. యోగీ ఆదిత్య నాథ్, బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
-
Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!