Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
- గురుగ్రామ్పై జలఖడ్గం
- 10 కి.మీ ట్రాఫిక్ జామ్
- ఎటుచూసినా నీళ్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్ అతలాకుతలం అయింది. జలఖడ్గంతో గురుగ్రామ్ బెంబేలెత్తిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గురుగ్రామ్ అస్తవ్యస్త్యం అయింది. ఇక భారీ వర్షాల కారణంగా హర్యానాలోని గురుగ్రామ్లో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-48)పై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నర్సింగ్పూర్ ప్రాంతంలోని సన్బీమ్ కంపెనీ సమీపంలో హైవేలోని ఓ భాగం ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఈ ఘటనతో ఐఎఫ్ఎఫ్సీఓ చౌక్ నుంచి నర్సింగ్పూర్ వరకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. హైవే కుంగిపోవడంతో గురుగ్రామ్ జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఘటనాస్థలంలో భారీ గుంత ఏర్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
గురుగ్రామ్లోని ఇతర ప్రాంతాల్లో కూడా రహదారులు కుంగిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట రహదారి కుంగిపోవడంతో ఓ ఎస్యూవీ వాహనం ముందు చక్రాలు గుంతలో ఇరుక్కుపోయాయి. అలాగే గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నివాసం, రాష్ట్ర మంత్రి రావు నర్బీర్ నివాసం సమీపంలో కూడా రహదారులు కుంగిపోవడంతో వాహనాలు చిక్కుకుపోయాయి. అధికారులు ఘటనాస్థలాలను పరిశీలిస్తూ పరిస్థితిని అంచనా వేశారు.
మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గురుగ్రామ్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మరింత స్తంభించింది. వరద నీటిలో కార్లు, బస్సులు, లారీలు నెమ్మదిగా ప్రయాణిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అనేక ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వాహనదారులు ఎన్హెచ్-48లో ప్రభావిత ప్రాంతాన్ని వీలైనంత వరకు నివారించాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలుగా రాజీవ్ చౌక్ దగ్గర ఎడమవైపు తిరిగి సదర్న్ పెరిఫెరల్ రోడ్ (SPR) ద్వారా ప్రయాణించాలని సూచించారు. అలాగే హీరో హోండా చౌక్ నుంచి కూడా ఎస్పీఆర్ మార్గాన్ని వినియోగించాలని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలు ద్వారకా ఎక్స్ప్రెస్వే ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. దెబ్బతిన్న హైవే భాగాన్ని మరమ్మతు చేసే పనులు కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు ట్రాఫిక్ సూచనలను పాటించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?