Uniform Civil Code: బీజేపీ కీలక నిర్ణయం.. యూనిఫాం సివిల్ కోడ్పై కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Government’s Big Move On Uniform Civil Code: గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, రేపో మాపో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే గుజరాత్ లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ అనుకుంటోంది. కాంగ్రెస్, ఆప్ పార్టీలు మాత్రం బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని పోరాడుతున్నాయి.
ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. శనివారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సఘవి ఈ రోజు ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కమిటీ సభ్యులను ప్రకటించనున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Bandi Sanjay: యాదాద్రిని కాదు.. మీ నోటిని యాసిడ్ తో కడగాలి
శుక్రవారం రోజున ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే బాటలో గుజరాత్ ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. గోవా తరువాత దీన్ని అమలు చేస్తున్న రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించబోతోందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఎలాంటి మత ప్రమేయం లేకుండా అందరికి కూడా ఒకే చట్టాలు ఉండేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తున్నామి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఈ ఏడాది మేలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కూడా యూనిఫా సివిల్ కోడ్ తీసుకువస్తామని ప్రకటించారు. దీంతో మరోసారి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ మొదలైంది. ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశంలోని అందరు పౌరులకు ఒకేటే పౌర నియమావళి ఉండాలని.. యూనిఫా సివిల్ కోడ్ ను సూచిస్తుంది.
ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ దీనిని రాజ్యాంగ విరుద్ధమైందని.. మైనారిటీల వ్యతిరేక చర్య అని పేర్కొంది. ద్రవ్యోల్భనం, ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకే ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలను తీసుకువస్తున్నాయిని ఆరోపించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!