Uniform Civil Code: బీజేపీ కీలక నిర్ణయం.. యూనిఫాం సివిల్ కోడ్పై కమిటీ
Gujarat Government’s Big Move On Uniform Civil Code: గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, రేపో మాపో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే గుజరాత్ లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ అనుకుంటోంది. కాంగ్రెస్, ఆప్ పార్టీలు మాత్రం బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని పోరాడుతున్నాయి.
ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. శనివారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సఘవి ఈ రోజు ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కమిటీ సభ్యులను ప్రకటించనున్నారు.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
Read Also: Bandi Sanjay: యాదాద్రిని కాదు.. మీ నోటిని యాసిడ్ తో కడగాలి
శుక్రవారం రోజున ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే బాటలో గుజరాత్ ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. గోవా తరువాత దీన్ని అమలు చేస్తున్న రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించబోతోందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఎలాంటి మత ప్రమేయం లేకుండా అందరికి కూడా ఒకే చట్టాలు ఉండేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తున్నామి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఈ ఏడాది మేలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కూడా యూనిఫా సివిల్ కోడ్ తీసుకువస్తామని ప్రకటించారు. దీంతో మరోసారి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ మొదలైంది. ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశంలోని అందరు పౌరులకు ఒకేటే పౌర నియమావళి ఉండాలని.. యూనిఫా సివిల్ కోడ్ ను సూచిస్తుంది.
ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ దీనిని రాజ్యాంగ విరుద్ధమైందని.. మైనారిటీల వ్యతిరేక చర్య అని పేర్కొంది. ద్రవ్యోల్భనం, ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకే ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలను తీసుకువస్తున్నాయిని ఆరోపించింది.
తాజావార్తలు
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!