Jammu Kashmir: ఉగ్రవాదులతో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధాలు.. విధుల నుంచి ఐదుగురి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt employees terminated for terror links:జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల అణిచివేతలో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించింది ప్రభుత్వం. వీరందరిని విధుల నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని నిబంధనలు 311(2)సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలిగించారు. ఉగ్రవాదులతో సంబంధాలు, నార్కో-టెర్రర్ సిండికేట్లను నడుపుతున్నందుకు, ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు నిషేధిత సంస్థలకు సహాయం చేసినందుకు ఈ ఐదుగురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు గత ప్రభుత్వాల సహాయంతో వీరంతా డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇలాంటి అనేక టెర్రరిస్టు సానుభూతిపరులు ప్రభుత్వ వ్యవస్థలో తిష్ట వేశారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వారిలో తన్వీర్ సలీమ్ దార్ కానిస్టేబుల్ గా ఉన్నాడు.
Also Read
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Read Also: Priya Bhavani Shankar: సత్యదేవ్ మూవీతో కోలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ!
1991లో విధుల్లో చేరిన తన్వీర్ జూలై 2002లో బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో ‘ఆర్మర్’పోస్టులో చేరాడు. ఉగ్రవాదుల ఆయుధాలను రిపేర్ చేయడంతో పాటు మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నట్లు తేలింది. శ్రీనగర్ లోని లష్కరే తోయిబా అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద కమాండర్, లాజిస్టిక్ ప్రొవైడర్ గా పనిచేస్తున్నాడు. తన్వీర్ శ్రీనగర్ లో జరిగిన వరస ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఎమ్మెల్సీ జానైద్ షల్లా హత్యలో కీలక పాత్ర పోషించాడని తరుపరి విచారణలో తేలింది.
మరో ఉద్యోగి అఫాక్ అహ్మద్ వనీ బారాముల్లా జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్తికార్ ఆంధ్రాబీ ప్లాంటేషన్ సూపర్ వైజర్ గా, ఇర్షాద్ అహ్మద్ ఖాన్ 2010లో జల్ శక్తి డిపార్ట్మెంట్ అర్డర్లీగా నియమితమయ్యాడు. అబ్దుల్ మోమిన్ పీర్ 2014లో పీహెచ్ఈ సబ్ డివిజన్ అసిస్టెంట్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. వీరందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించడంతో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
-
Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!