Jammu Kashmir: ఉగ్రవాదులతో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధాలు.. విధుల నుంచి ఐదుగురి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt employees terminated for terror links:జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల అణిచివేతలో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించింది ప్రభుత్వం. వీరందరిని విధుల నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని నిబంధనలు 311(2)సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలిగించారు. ఉగ్రవాదులతో సంబంధాలు, నార్కో-టెర్రర్ సిండికేట్లను నడుపుతున్నందుకు, ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు నిషేధిత సంస్థలకు సహాయం చేసినందుకు ఈ ఐదుగురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు గత ప్రభుత్వాల సహాయంతో వీరంతా డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇలాంటి అనేక టెర్రరిస్టు సానుభూతిపరులు ప్రభుత్వ వ్యవస్థలో తిష్ట వేశారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వారిలో తన్వీర్ సలీమ్ దార్ కానిస్టేబుల్ గా ఉన్నాడు.
Also Read
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
Read Also: Priya Bhavani Shankar: సత్యదేవ్ మూవీతో కోలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ!
1991లో విధుల్లో చేరిన తన్వీర్ జూలై 2002లో బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో ‘ఆర్మర్’పోస్టులో చేరాడు. ఉగ్రవాదుల ఆయుధాలను రిపేర్ చేయడంతో పాటు మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నట్లు తేలింది. శ్రీనగర్ లోని లష్కరే తోయిబా అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద కమాండర్, లాజిస్టిక్ ప్రొవైడర్ గా పనిచేస్తున్నాడు. తన్వీర్ శ్రీనగర్ లో జరిగిన వరస ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఎమ్మెల్సీ జానైద్ షల్లా హత్యలో కీలక పాత్ర పోషించాడని తరుపరి విచారణలో తేలింది.
మరో ఉద్యోగి అఫాక్ అహ్మద్ వనీ బారాముల్లా జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్తికార్ ఆంధ్రాబీ ప్లాంటేషన్ సూపర్ వైజర్ గా, ఇర్షాద్ అహ్మద్ ఖాన్ 2010లో జల్ శక్తి డిపార్ట్మెంట్ అర్డర్లీగా నియమితమయ్యాడు. అబ్దుల్ మోమిన్ పీర్ 2014లో పీహెచ్ఈ సబ్ డివిజన్ అసిస్టెంట్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. వీరందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించడంతో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు.
తాజావార్తలు
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..