Tamil Nadu Governor: టీఎన్పీఎస్సీ చైర్మన్ ఫైల్ను ఆపేసిన గవర్నర్.. మరిన్ని వివరాలు కావాలంటూ ప్రభుత్వానికి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: ఈ మధ్య కాలంలో గవర్నర్లకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అటువంటి పరిస్థితే ఇపుడు తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతోంది. మొన్నటికి మొన్న నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి .. ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం కోరగా.. అందుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. నీట్ ఉండాల్సిందనేనని.. రాష్ట్రం అందులో నుంచి తప్పుకుంటే రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. కాబట్టి తాను అందుకు ఒప్పుకోనని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కేంద్రానికి పంపించలేదు. ఇప్పుడు తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎన్పీఎస్సీ) ఛైర్మన్ మరియు సభ్యుల నియామకంకు సంబంధించిన ఫైల్ను ఆమోదించకుండా పక్కన బెట్టారు. టీఎన్పీఎస్సీ ఛైర్మన్ మరియు సభ్యుల ఫైల్ను ఆమోదించకుండా.. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది.
Read Also: Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?
Also Read
తమిళనాడు గవర్నర్ చర్యపై స్టాలిన్ సర్కార్ మండిపడుతోంది. టీఎన్పీఎస్సీ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం పంపిన ఫైల్ను గవర్నర్ వెనక్కిపంపారు. అంతేకాకుండా.. తమిళనాడు కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ‘మోడల్ సిలబస్’ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. ‘మోడల్ సిలబస్’ను ఫాలో కావాల్సిన అవసరం లేదని తెలుపుతూ యూనివర్సిటీ వీసీలకు గవర్నర్ లేఖలు పంపారు. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్ లర్గా వ్యవహారిస్తారన్న విషయం తెలిసిందే. యూజీసీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల సిలబస్ ఎలా తయారుచేస్తుందని గవర్నర్ ప్రశ్నించారు. టీఎన్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ సీ సైలేంద్రబాబును నియమిస్తూ, కమిషన్ సభ్యులుగా మరో 14 మంది పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి సంబంధిత ఫైల్ను పంపించింది. అయితే కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటూ ఫైల్ను వెనక్కి పంపారని గవర్నర్ అధికారిక వర్గాలు తెలిపాయి. గవర్నర్ వ్యవహారించిన తీరును డీఎంకే వర్గాలు తీవ్రంగా ఖండించాయి. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తుల్ని కమిషన్కు ఎంపికచేసినా.. ఆ ఫైల్ను ఎందుకు ఆమోదించలేదని డీఎంకే నాయకుడు ఆర్ఎస్ భారతీ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలకు ఇలా ప్రతీసారి అడ్డుతగలడం గవర్నర్కు సరైంది కాదని అంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!