Supreme court: ‘‘ ఉరిశిక్ష ’’ మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు.. సుప్రీంకోర్టు ఆక్షేపణ..
- ఉరిశిక్షను మార్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదు: సుప్రీంకోర్టు..
- ఉరి ద్వారా మరణశిక్ష అమలుపై పిల్ దాఖలు..
- ఉరి వర్సెస్ ప్రాణాంతక ఇంజెక్షన్పై ఆసక్తికర చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme court: ‘‘ఉరితీయడం’’ ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా, ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది. మరణశిక్షలకు ఉరితీయడానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్లు, కరెంట్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి తక్కువ బాధాకరమైన ప్రత్యామ్నాయాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
ఉరిశిక్ష ద్వారా ప్రాణాలు తీయడం చాలా బాధకరమైందని, అమానవీయమైందని, క్రూరమైందని న్యాయవాది రిషి మల్హోత్రా పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష విధించబడిన వ్యక్తికి ‘‘చనిపోయే వరకు మెడకు ఉరితీయడం ద్వారా’’ శిక్షను ఆదేశించి నిబంధన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 354(5)ని కూడా ఈ పిటిషన్ సవాలు చేస్తుంది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ఆధునిక మానవీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్ పేర్కొంది.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
అయితే, కేంద్రం ఈ ఆలోచనను వ్యతిరేకించింది. ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది సోనియా మథూర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఎంపికలు ఆచరణాత్మకంగా సాధ్యం కాదు అని, ఉరిశిక్షను మార్చడం అనేది విధానపరమైన నిర్ణయం అని, దీనిని ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని, కోర్టులు కాదు అని అన్నారు.
కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారేందుకు సిద్ధంగా లేవని, ఇది చాలా పాత పద్ధతి అని, కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గతంలో ఉరి శిక్షను సమర్థించింది. అయితే, పిటిషనర్ ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరింత వేగంగా శిక్ష అమలు చేయవచ్చని, మరింత మానవీయంగా ఉంటుందని, అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 49 రాష్ట్రాలు దీనిని స్వీకరించాయని పేర్కొన్నారు.
ఉరిశిక్ష అమలు పద్ధతులను సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం పరిశీలిస్తోందని కోర్టు గతంలో గుర్తించింది. బుధవారం, ఆ కమిటీ స్థితిపై కొత్త సూచనలను కోరుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్పై నవంబర్ 11న మళ్లీ విచారణ చేయనునంది. మరణశిక్ష ఇప్పటికీ అమలులో ఉన్న దేశాల్లో సాధ్యమైనంత తక్కువ బాధాకరమైన రీతిలో శిక్షను అమలు చేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కూడా పిటిషనర్ మల్హోత్రా పిటిషన్లో ఉదహరించారు.
తాజావార్తలు
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!