100% Ethanol: 100% ఇథనాల్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- 100% ఇథనాల్పై ప్రభుత్వ కీలక నిర్ణయం
- E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- E20 లక్ష్యాన్ని ముందుగానే సాధించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన వాహనాల్లో 100 శాతం ఇథనాల్ (E100) ఇంధనాన్ని వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. E100 ఇంధన వినియోగానికి సంబంధించిన ఫైల్పై సంతకాలు పూర్తయ్యాయని, దీంతో దేశంలో స్వచ్ఛమైన ఇథనాల్ ఇంధన వినియోగానికి మార్గం సుగమమైందని తెలిపారు.
E20 లక్ష్యాన్ని ముందుగానే సాధించిన భారత్
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే ముందుగానే చేరుకుంది. దీనివల్ల ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశానికి రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విజయంతో ఉత్సాహం పొందిన కేంద్రం ఇప్పుడు పూర్తిస్థాయి ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది.
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
గడ్కరీ ఏమన్నారు?
నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “100 శాతం ఇథనాల్ను చట్టబద్ధంగా ఉపయోగించేందుకు అనుమతిస్తూ నిన్న రాత్రి 8 గంటలకు ఫైల్పై సంతకం చేశాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఒకప్పుడు ఈ ఆలోచనను చాలామంది ఎగతాళి చేశారని, ఇథనాల్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వ్యతిరేక ప్రచారాలు కూడా జరిగాయని, అయితే ఇప్పుడు ఆ కల నిజమవుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇథనాల్ వాహనాలకు సిద్ధమవుతున్న ఆటో కంపెనీలు
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు 100 శాతం ఇథనాల్తో నడిచే వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇటీవల మారుతి సుజుకి తన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాగన్ఆర్ వేరియంట్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఆవిష్కరించింది. అలాగే హీరో మోటోకార్ప్ కూడా స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ వంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్సైకిళ్లను పరిచయం చేసింది.
మరో రెండు నెలల్లో కొత్త వాహనాలు
“రాబోయే రెండు నెలల్లో అనేక ఆటోమొబైల్ కంపెనీలు 100 శాతం ఇథనాల్తో నడిచే వాహనాలను విడుదల చేస్తాయి” అని గడ్కరీ వెల్లడించారు. టయోటా, సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ వంటి సంస్థలు కూడా త్వరలోనే ఇథనాల్-అనుకూల వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపుల ఏర్పాటు
ప్రభుత్వ ఇథనాల్ మిషన్ను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఇథనాల్ ఇంధన పంపుల నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇథనాల్ పంపులు ప్రారంభమవుతున్నాయి. 2027 నాటికి దేశవ్యాప్తంగా వాటి సంఖ్యను 5,000కు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
రైతులకు లాభం.. దేశానికి ఇంధన భద్రత
భారతదేశం ప్రతి ఏడాది భారీ మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యంపై భారీ భారం పడుతోంది. పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా చమురు దిగుమతులను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడమే కాకుండా, చెరకు వంటి పంటల ఉత్పత్తిదారులైన రైతుల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్లో కొత్త ల్యాప్టాప్లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..