Wrestler Virender Singh: “నేను కూడా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తా”.. సాక్షిమాలిక్కి మద్దతు తెలిపిన వీరేందర్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wrestler Virender Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం కొనసాగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కావడాన్ని రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏస్ రెజ్లర్ సాక్షిమాలిక్ సంజయ్ సింగ్ ఎన్నికపై కన్నీటిపర్యంతమయ్యారు. తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీని ప్రధాని నరేంద్రమోడీకి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా రెజ్లర్ వీరేందర్ సింగ్, సాక్షి మాలిక్కి మద్దతు తెలిపారు. ‘‘నేను నా సోదరి, ఈ దేశ బిడ్డ సాక్షి మాలిక్, ప్రధాని నరేంద్రమోడీ జీ కోసం తన పద్మశ్రీని తిరిగి ఇస్తాను. నేను సాక్షిమాలిక్ గురించి గర్వపడుతున్నాను. మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించాలి’’ అని సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రాలను ట్యాగ్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
Read Also: Heater Incident: హీటర్లో మంటలు.. తండ్రి, 3 నెలల కూతురు సజీవదహనం..
తాను ప్రధాని మోడీకి లేఖ రాశానని, తనకు ఇచ్చిన పద్మశ్రీని తిరిగి ఇస్తానని శుక్రవారం రెజ్లర్ బజరంగ్ పునియా తెలిపిన మరుసటి రోజే వీరేందర్ సింగ్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్కి చేరుకున్న పునియా అక్కడ ఫుట్పాత్పై పద్మశ్రీ పతకాన్ని ఉంచారు, దీనిని ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘‘మహిళా రెజ్లర్లకు తగిన గౌరవం ఇవ్వనప్పుడు నాకు కూడా గౌరవం దక్కదు.. 40 రోజులుగా రోడ్డున పడ్డాం.. కానీ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చలేదు. మా పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను న్యాయవ్యవస్థను నమ్ముతాను. కానీ జరుగుతున్న పరిణామాల వల్ల నేను వ్యవస్థపై విశ్వాసం ఉంచలేను’’ అని పునియా శుక్రవారం అన్నారు.
ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత తొలి బాక్సర్ విజేందర్ సింగ్ కూడా నిన్న సాక్షిమాలిక్కి మద్దతు తెలిపారు. ‘‘ఒలింపిక్ పతక విజేతకు న్యాయం జరగకపోతే, మాకు ఎలా న్యాయం జరుగుతుందని కుమార్తెల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని అందరూ ఇలా ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలి. న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య నిర్మాణంపై ఇది చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!