Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- గోవాలో ఘోరం
- రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్
- తీవ్ర మనస్తాపానికి గురై డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. చెత్త వీడియో కారణంగా ఓ విద్యాకుసుమం నేల రాలిపోయింది. ఈ దుర్ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే…
23 ఏళ్ల శామ్యూల్ అనే యువకుడు గోవాలోని మపుసా ప్రాంతంలో నివసిస్తున్నాడు. తల్లి, ఇద్దరు సోదరీమణులతో నివసిస్తూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇటీవల ఉత్తర గోవాలోని ఓ రహదారి పక్కన శామ్యూల్ చెత్త వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అనంతరం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అంతేకాకుండా వ్యతిరేకంగా ట్రోలింగ్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై… మానసికంగా కృంగిపోవడంతో అర్ధాంతరంగా తనువు చాలించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
కేసు నమోదు.. పోలీసుల నోటీసు
వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు శామ్యూల్పై కేసు నమోదు చేశారు. అనంతరం అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. విచారణలో భాగంగా అతడు పోలీసుల ఎదుట హాజరై సహకరించినట్లు అధికారులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్, విమర్శలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తుపాకీతో కాల్చుకుని..
పోలీసుల వివరాల ప్రకారం.. కుటుంబానికి చెందిన లైసెన్సు కలిగిన తుపాకీతో శామ్యూల్ తనకు తానుగా కాల్చుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు వైరల్ వీడియో, పోలీసు కేసు, సోషల్ మీడియా ట్రోలింగే కారణమయ్యాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత శామ్యూల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. గత కొన్ని గంటలుగా అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
దర్యాప్తు కొనసాగుతోంది
అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి (Accidental Death) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైరల్ వీడియో తర్వాత జరిగిన పరిణామాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావం, విద్యార్థి మానసిక పరిస్థితి వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన సోషల్ మీడియా ట్రోలింగ్, ఆన్లైన్ విమర్శలు యువత మానసిక ఆరోగ్యంపై ఎంత తీవ్ర ప్రభావం చూపగలవో మరోసారి జాతీయంగా చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!