Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- గోవాలో ఘోరం
- రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్
- తీవ్ర మనస్తాపానికి గురై డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. చెత్త వీడియో కారణంగా ఓ విద్యాకుసుమం నేల రాలిపోయింది. ఈ దుర్ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే…
23 ఏళ్ల శామ్యూల్ అనే యువకుడు గోవాలోని మపుసా ప్రాంతంలో నివసిస్తున్నాడు. తల్లి, ఇద్దరు సోదరీమణులతో నివసిస్తూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇటీవల ఉత్తర గోవాలోని ఓ రహదారి పక్కన శామ్యూల్ చెత్త వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అనంతరం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అంతేకాకుండా వ్యతిరేకంగా ట్రోలింగ్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై… మానసికంగా కృంగిపోవడంతో అర్ధాంతరంగా తనువు చాలించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
Also Read
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
కేసు నమోదు.. పోలీసుల నోటీసు
వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు శామ్యూల్పై కేసు నమోదు చేశారు. అనంతరం అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. విచారణలో భాగంగా అతడు పోలీసుల ఎదుట హాజరై సహకరించినట్లు అధికారులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్, విమర్శలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తుపాకీతో కాల్చుకుని..
పోలీసుల వివరాల ప్రకారం.. కుటుంబానికి చెందిన లైసెన్సు కలిగిన తుపాకీతో శామ్యూల్ తనకు తానుగా కాల్చుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు వైరల్ వీడియో, పోలీసు కేసు, సోషల్ మీడియా ట్రోలింగే కారణమయ్యాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత శామ్యూల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. గత కొన్ని గంటలుగా అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
దర్యాప్తు కొనసాగుతోంది
అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి (Accidental Death) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైరల్ వీడియో తర్వాత జరిగిన పరిణామాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావం, విద్యార్థి మానసిక పరిస్థితి వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన సోషల్ మీడియా ట్రోలింగ్, ఆన్లైన్ విమర్శలు యువత మానసిక ఆరోగ్యంపై ఎంత తీవ్ర ప్రభావం చూపగలవో మరోసారి జాతీయంగా చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!