GoAir: గో ఎయిర్ విమానాల్లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GoAir flights emergency landing: దేశంలోొ వరసగా విమానాలు సాంకేతిక లోపాలకు గురవుతున్నాయి. ఆదివారం రోజు రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తాజాగా గో ఎయిర్ సంస్థకు సంబంధించిన రెండు విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తడంతో వీటిని దారి మళ్లించి సమీప విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేశారు. మంగళవారం ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఎయిర్ ఏ320 వీటీడబ్ల్యూజీఏ విమానంలో ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తతెత్తడంతో ఢిల్లీకి మళ్లించారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న మరో గో ఎయిర్ ఏ 320 డబ్ల్యూజేజీ విమానంలో కూడా ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శ్రీనగర్ విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింవది. గత నెల కాలం నుంచి వరసగా భారతీయ విమాన సంస్థలకు సంబంధించిన పలు విమానాలలో సాంకేతిక లోపాలు సంభవించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముఖ్యంగా స్పైస్ జెట్ కు సంబంధించిన పలు విమానాలు సాంకేతిక లోపాలకు గురయ్యాయి. వీటిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇటీవల పలు విమానాలకు సంబంధించి సాంకేతిక లోపాల రావడంతో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భద్రతా పర్యవేక్షణపై డీజీసీఏ అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
గడిచిన ఆదివారం కూడా రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో సాంకేతిక లోపాలు రావడంతో వీటిని ఎమర్జెన్సీ ల్యాండిాంగ్ చేశారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాకిస్తాన్ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు కాలికట్ నుంచి దుబాయ్ ఎళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో సమస్య ఏర్పడటంతో దీన్ని ఒమన్ దేశం మస్కల్ లో ల్యాండ్ చేశారు. ఇదే విధంగా జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో కూడా సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!