Anurag Thakur: అవినీతి మంత్రులకు నిజాయితీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కేజ్రీవాల్ ‘ఢిల్లీ మోడల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఢిల్లీ మోడల్ బట్టబయలైందని, రాబోయే రోజుల్లో ఆప్ అవినీతి అంతా తెరపైకి వస్తుందని ఠాకూర్ అన్నారు. కేజ్రీవాల్ పుస్తకమైన ‘స్వరాజ్’ ను ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో ఆప్ సర్కారు మద్యం రాజ్యాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
‘స్వరాజ్’ అనే తన పుస్తకంలో కేజ్రీవాల్ పౌరులను అడగకుండా, మహిళలను అడగకుండా డబ్బు వసూలు చేయడానికి ప్రభుత్వం మద్యం కాంట్రాక్టులను కేటాయిస్తుందని రాశారన్నారు. మద్యం కాంట్రాక్టులు కేటాయించే ముందు కేజ్రీవాల్ ఎవరిని అడిగారని ఆయన ప్రశ్నించారు. తన పార్టీకి చెందిన కొంతమంది నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై ఆయన విరుచుకుపడ్డారు. సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్పై 24గంటల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మొదటి వారి ఆరోగ్య శాఖ మంత్రి అరెస్టు చేయబడి 3 నెలలు జైలులో ఉన్నాడని.. ఇప్పుడు అవినీతి ఎక్సైజ్ శాఖ మంత్రి నిందితుల మొదటి జాబితాలో ఉన్నాడన్నారు. కానీ ఇప్పటీకి కేజ్రీవాల్ మౌనంగానే ఉన్నాడని విరుచుకుపడ్డారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
‘కేజ్రీవాల్ మోడల్’ అనేది ప్రకటనల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం, వారి సొంత మంత్రులకు నిజాయితీ సర్టిఫికేట్లు ఇవ్వడం అని ఆయన విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ మోడల్ డీకోడ్ చేయబడిందంటూ మండిపడ్డారు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా పబ్లిసిటీ చేయడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఆరోపించారు. పట్టుబడినప్పుడు మరొకరిపై నెట్టేస్తారన్నారు. అవినీతిపరులకు నిజాయితీ సర్టిఫికేట్లు ఇవ్వడం కేజ్రీవాల్ మోడల్ అంటూ ఆరోపించారు. ఒకే వ్యక్తి విద్యాశాఖతో పాటు మద్యం శాఖలకు కూడా నాయకత్వం వహిస్తున్నాడని, అదే అరవింద్ కేజ్రీవాల్ మోడల్ అని ఠాకూర్ అన్నారు.
AP Cm Jaganmohan Reddy: ప్రధాని మోడీతో సీఎం వైఎస్.జగన్ భేటీ
ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అమలులో ఆరోపించిన కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం మనీష్ సిసోడియా నివాసంపై దాడి చేసింది. అది ఇప్పుడు ఉపసంహరించబడింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిలో సిసోడియా ఉన్నారు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లు, కొందరు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సిసోడియా, ఆప్ నిర్దోషులని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందునే సిసోడియాను టార్గెట్ చేశారని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!