Anurag Thakur: అవినీతి మంత్రులకు నిజాయితీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కేజ్రీవాల్ ‘ఢిల్లీ మోడల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఢిల్లీ మోడల్ బట్టబయలైందని, రాబోయే రోజుల్లో ఆప్ అవినీతి అంతా తెరపైకి వస్తుందని ఠాకూర్ అన్నారు. కేజ్రీవాల్ పుస్తకమైన ‘స్వరాజ్’ ను ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో ఆప్ సర్కారు మద్యం రాజ్యాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
‘స్వరాజ్’ అనే తన పుస్తకంలో కేజ్రీవాల్ పౌరులను అడగకుండా, మహిళలను అడగకుండా డబ్బు వసూలు చేయడానికి ప్రభుత్వం మద్యం కాంట్రాక్టులను కేటాయిస్తుందని రాశారన్నారు. మద్యం కాంట్రాక్టులు కేటాయించే ముందు కేజ్రీవాల్ ఎవరిని అడిగారని ఆయన ప్రశ్నించారు. తన పార్టీకి చెందిన కొంతమంది నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై ఆయన విరుచుకుపడ్డారు. సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్పై 24గంటల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మొదటి వారి ఆరోగ్య శాఖ మంత్రి అరెస్టు చేయబడి 3 నెలలు జైలులో ఉన్నాడని.. ఇప్పుడు అవినీతి ఎక్సైజ్ శాఖ మంత్రి నిందితుల మొదటి జాబితాలో ఉన్నాడన్నారు. కానీ ఇప్పటీకి కేజ్రీవాల్ మౌనంగానే ఉన్నాడని విరుచుకుపడ్డారు.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
‘కేజ్రీవాల్ మోడల్’ అనేది ప్రకటనల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం, వారి సొంత మంత్రులకు నిజాయితీ సర్టిఫికేట్లు ఇవ్వడం అని ఆయన విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ మోడల్ డీకోడ్ చేయబడిందంటూ మండిపడ్డారు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా పబ్లిసిటీ చేయడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఆరోపించారు. పట్టుబడినప్పుడు మరొకరిపై నెట్టేస్తారన్నారు. అవినీతిపరులకు నిజాయితీ సర్టిఫికేట్లు ఇవ్వడం కేజ్రీవాల్ మోడల్ అంటూ ఆరోపించారు. ఒకే వ్యక్తి విద్యాశాఖతో పాటు మద్యం శాఖలకు కూడా నాయకత్వం వహిస్తున్నాడని, అదే అరవింద్ కేజ్రీవాల్ మోడల్ అని ఠాకూర్ అన్నారు.
AP Cm Jaganmohan Reddy: ప్రధాని మోడీతో సీఎం వైఎస్.జగన్ భేటీ
ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అమలులో ఆరోపించిన కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం మనీష్ సిసోడియా నివాసంపై దాడి చేసింది. అది ఇప్పుడు ఉపసంహరించబడింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిలో సిసోడియా ఉన్నారు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లు, కొందరు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సిసోడియా, ఆప్ నిర్దోషులని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందునే సిసోడియాను టార్గెట్ చేశారని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!