Gauri Lankesh murder: గౌరీ లంకేష్ హత్యా నిందితులకు హిందూ అనుకూల సంఘాల నుంచి ఘనస్వాగతం..
- గౌరీ లంకేష్ హత్య నిందితులకు ఘన స్వాగతం..
- హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో సన్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్మోర్, మనోహర్ యాదవ్లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు.
కర్ణాటకలోని విజయపురలోని స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారికి హిందూ అనుకూల మద్దతుదారులు పూలమాలలు వేసి, కాషాయ శాలువాలతో సత్కరించారు. నినాదాలతో స్వాగతం పలికారు. వారిద్దరిని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు. అనంతరం కాళికా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. నిందితుల మద్దతుదారులు మాట్లాడుతూ.. వారిని తప్పుగా జైలులో పెట్టారని పేర్కొన్నారు.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
Read Also: Salman Khan: సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..
వాఘ్మోర్, యాదవ్లతో పాటు అమోల్ కాలే, రాజేష్ డి బంగేరా, వాసుదేశ్ సూర్యవంశీ, రుషీకేష్ దేవదేకర్, గణేష్ మిస్కిన్, అమిత్ రామచంద్ర బడ్డీలకు అక్టోబర్ 09న బెయిల్ మంజూరైంది. ప్రోహిందూ లీడర్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు విజయదశమి, మాకు ముఖ్యమైన రోజు. గౌరీ లంకేష్ హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఆరేళ్లుగా అన్యాయంగా జైలులో ఉన్న పరశురామ్ వాఘ్మోర్, మనోహర్ యాదవ్లను మేము స్వాగతిస్తున్నాము. అసలు నేరస్థులు ఇంకా కనుగొనబడలేదు, కానీ ఈ వ్యక్తులు కేవలం హిందూ అనుకూలులుగా ఉన్నందుకు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అన్యాయానికి తీవ్రమైన ఆత్మపరిశీలన అవసరం.’’ అని అన్నారు.
వామపక్ష భావాలు ఉన్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్, హిందుత్వ భావజాలానికి బద్ధవ్యతిరేకిగా ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 05, 2017న బెంగళూర్లో ఆమె ఇంటి వెలుపల ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డిసెంబర్ 2023లో గౌరీలంకేష్ హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.
తాజావార్తలు
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!