Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట
- గ్యాస్ కొరతకు చెక్.. సరఫరా 20% పెంపు
- హోటళ్లు, పరిశ్రమలకు ప్రాధాన్యత
- వలస కార్మికులకు ఉచిత సిలిండర్లు
- రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్లో గత మూడు వారాలుగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను తక్షణమే 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత కారణంగా అనేక రెస్టారెంట్లు, డాబాలు , హోటళ్లు మూతపడే పరిస్థితి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన సరఫరాలో మొదటగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు , డైరీ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని స్పష్టం చేసింది.
Sundeep Kishan: సందీప్ కిషన్తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ ప్రక్రియ ఎల్లుండి (మార్చి 23) నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను విధించింది. కమర్షియల్ యూజర్లు , వలస కూలీలు సంబంధిత యాప్ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని తెలిపింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, కేవలం సరఫరాను క్రమబద్ధీకరించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!