Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట
- గ్యాస్ కొరతకు చెక్.. సరఫరా 20% పెంపు
- హోటళ్లు, పరిశ్రమలకు ప్రాధాన్యత
- వలస కార్మికులకు ఉచిత సిలిండర్లు
- రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్లో గత మూడు వారాలుగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను తక్షణమే 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత కారణంగా అనేక రెస్టారెంట్లు, డాబాలు , హోటళ్లు మూతపడే పరిస్థితి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన సరఫరాలో మొదటగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు , డైరీ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని స్పష్టం చేసింది.
Sundeep Kishan: సందీప్ కిషన్తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా
Also Read
మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ ప్రక్రియ ఎల్లుండి (మార్చి 23) నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను విధించింది. కమర్షియల్ యూజర్లు , వలస కూలీలు సంబంధిత యాప్ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని తెలిపింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, కేవలం సరఫరాను క్రమబద్ధీకరించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!