Mehul Choksi: భారత్కు చిక్కకుండా వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్లాన్.. ఆంటిగ్వా అధికారులకు భారీగా లంచాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehul Choksi: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇండియాలో పలు బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు పారిపోయారు. అయితే అప్పటి నుంచి అతడిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కు పాల్పడిన మెహుల్ చోక్సీ 2018లో దేశం వదలి పారిపోయాడు. ఇతడిపై ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో ఉన్న ఆయన అక్కడి అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను ఎరగా వేసి భారత్ కు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తేలింది. ప్రముఖ ఆర్థిక నేరా పరిశోధకుడు కెన్నెత్ రిజోక్ పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Taslima Nasreen: రాఖీ సావంత్కే తప్పలేదు..ఇస్లాంపై బంగ్లాదేశీ రచయిత్రి వ్యాఖ్యలు..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
భారత్ కు అప్పగించేందుకు ఇంటర్ పోల్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడు. ఆంటిగ్వాలో సీనియర్ పోలీస్ అధికారి అడోనిస్ హెన్రీతో సహా పలువురు ప్రభుత్వ అధికారులకు అంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నాడు. చోక్సీకి చెందిన జాలీ హార్బర్ రెస్టారెంట్ అల్ పోర్టోలో చోక్సీ, పోలీస్ అధికారి హెన్రీ రోజుకు కనీసం మూడు సార్లు కలుస్తారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులకే కాకుండా ఆంటిగ్వా మెజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్ ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని తెలిసింది. తనను భారత్ కు అప్పగించే ప్రక్రియను అడ్డుకునేందుకు చోక్సీ, హెన్రీ, క్లార్క్ లతో కలిసి కుట్ర పన్నినట్లు తేలింది.
కాగా.. గతంలో క్యూబా పారిపోవాలని చోక్సీ ప్లాన్ వేశాడు. క్యూబాకు ఇండియాకు మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. క్యూబాకు నౌకలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే నౌకలోని స్మగ్లర్లకు ఒప్పుకున్న డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన్న డొమెనికన్ తీరంలో వదిలివెళ్లారు. ఇది 2021లో జరిగింది. ఆంటిగ్వాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి చోక్సీ అక్కడి పౌరసత్వం సంపాదించాడు. అయితే.. అక్కడి కోర్టు చోక్సీని భారత్ కు అప్పగించాలని ఆదేశించినప్పటికీ, చోక్సీ మిలియన్ల డాలర్ల నగదును దొంగిలించాడని ఆరోపిస్తూ అక్కడి అవినీతి అధికారులు, న్యాయమూర్తులు అతడి విచారణను కావాలని ఆలస్య చేస్తూ భారత్ కు అప్పగించే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!