Vajpayee Death Anniversary: ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vajpayee Death Anniversary: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 5వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు సదైవ్ అటల్ స్మారకం వద్ద వాజ్పేయికి నివాళులర్పించారు. వారితోపాటు కేంద్రమంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ నేతలు నివాళులర్పించారు. వాజ్పేయి నాయకత్వం నుంచి దేశం చాలా లబ్ధి పొందిందని ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో తెలిపారు. దేశ ప్రగతిలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని.. అనేక రంగాలను 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లారని పేర్కొన్నారు.
Read also: New Housing Scheme: స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా ప్రధాని కానుక.. కొత్త గృహనిర్మాణ పథకం ప్రారంభం
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
‘‘అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులు అర్పించడంలో 140 కోట్ల మంది భారత ప్రజలతో నేను చేరుతున్నాను’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆయన నాయకత్వం నుంచి భారతదేశం చాలా లాభపడిందని అన్నారు. మన దేశ ప్రగతిని పెంచడంలో, విస్తృత శ్రేణి రంగాలలో 21వ శతాబ్దానికి తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బీజేపీ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వాజ్పేయి.. పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. విశేష ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు వాజ్పేయి.. ఆరేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించి ఘనత సాధించారని తెలిపారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు.. మౌలిక సదుపాయాలను పెంచడానికి కృషి చేశారన్నారు. వాజ్పేయి తన 93 సంవత్సరాల వయస్సులో 2018లో మరణించారని గుర్తు చేసుకుని నివాళులర్పించారు.
I join the 140 crore people of India in paying homage to the remarkable Atal Ji on his Punya Tithi. India benefitted greatly from his leadership. He played a pivotal role in boosting our nation's progress and in taking it to the 21st century in a wide range of sectors.
— Narendra Modi (@narendramodi) August 16, 2023
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..