New Housing Scheme: స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా ప్రధాని కానుక.. కొత్త గృహనిర్మాణ పథకం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Housing Scheme: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది నగరాల్లో అద్దెకు నివసిస్తున్న అధిక జనాభాకు శుభవార్త కానుంది. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే దేశంలోని మధ్యతరగతి ప్రజల కోసం తమ ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతోందని ప్రధాని మోడీ చెప్పారు. దీంతో ప్రజల సొంత ఇంటి కల సాకారం కావడంతోపాటు ఖరీదైన బ్యాంకు వడ్డీల నుంచి కూడా ఉపశమనం లభించనుంది.
ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, దేశంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించనుంది. దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఇళ్లు కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం రుణ వడ్డీకి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో పథకాన్ని ప్రారంభించబోతోంది. దరఖాస్తులు, మురికివాడల్లో నివసించే ప్రజలు, అనధికార కాలనీల్లో నివసిస్తున్న కుటుంబాలు దీని ప్రత్యక్ష ప్రయోజనం పొందుతాయి. దీంతో పాటు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also:Asia Cup 2023: ఒక్క సిరీస్ కెరీర్నే మార్చేసింది.. తిలక్ వర్మకు ఆసియా కప్ 2023లో చోటు!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U)
పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం జూన్ 25, 2015న ప్రారంభించబడింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా గృహాలు తక్కువ ధరకు అందించబడతాయి.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలై 31, 2023 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 118.90 లక్షల ఇళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 76.02 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వగా మిగిలిన వాటిలో పనులు కొనసాగుతున్నాయి. PMAY-U క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకం కింద దేశంలోని పేద వర్గానికి 6.5 శాతం వడ్డీ రేటు రాయితీ లభిస్తుంది. ప్రతి ఇంటికి లబ్ధిదారులు మొత్తం రూ. 2.67 లక్షల ప్రయోజనం పొందవచ్చు.
Read Also:Prabhas: ‘సలార్’ రన్ టైం లీక్… ఎన్ని గంటల విధ్వంసం?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!