Subhash Singh passes away: బిహార్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సుభాష్ సింగ్ మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన సుభాష్ సింగ్కు గతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సుభాష్ సింగ్ అనారోగ్యం బారినపడడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో సుభాష్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు చెప్పారు. సుభాష్ మృతి పట్ల బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. సుభాష్ సింగ్ 2015లో గోపాల్గంజ్ నుండి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
బీహార్ మాజీ మంత్రి తార్కిషోర్ ప్రసాద్ ఒక ట్వీట్లో ఇలా వ్రాశారు.. “బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి, గోపాల్గంజ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మృతికి హృదయపూర్వక నివాళులు. దేవుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన మరణం బీహార్ రాజకీయాలకు, బీజేపీకి తీరని లోటు.” అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.