BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్..బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్..
- బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్దేవా ఆయనను ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా నియమించారు.తాను ఎమ్మెల్యేగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించానని, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక కూడా వేయలేదని దలాల్ ఆరోపించారు. ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, ఆప్ తన అవినీతి నిరోధక హామీలకు దూరంగా ఉందని ఆరోపించారు.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
Read Also: Jaya Bachchan: లోక్సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య
ఆప్ క్రీడా యూనివర్సిటీ గురించి తప్పుడు హామీలు ఇచ్చిందని సచ్దేవా విమర్శించారు. కాగితంపై నియామకాలు జరిగాయని, నిధులు పంపిణీ చేయబడ్డాయని, కానీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రారంభించినా, తన హయాంలోనే పూర్తి చేసేలా చూస్తోందని చెప్పారు.
ఢిల్లీలోని పంజాబీ, గ్రామీణ వర్గాల్లో బల్బీర్ సింగ్, సుఖ్బీర్ దలాల్కి మంచి పేరుందని సచ్దేవా ప్రశంసించారు. కేంద్రమంత్రి మల్హోత్రా మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఒకప్పుడు పార్టీ అవినీతికి వ్యతిరేకమని చెప్పేవారని, ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని వదిలేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేశారని, అందుకు ఆప్ నుంచి పలువురు నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!