BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్..బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్..
- బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్దేవా ఆయనను ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా నియమించారు.తాను ఎమ్మెల్యేగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించానని, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక కూడా వేయలేదని దలాల్ ఆరోపించారు. ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, ఆప్ తన అవినీతి నిరోధక హామీలకు దూరంగా ఉందని ఆరోపించారు.
Also Read
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Read Also: Jaya Bachchan: లోక్సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య
ఆప్ క్రీడా యూనివర్సిటీ గురించి తప్పుడు హామీలు ఇచ్చిందని సచ్దేవా విమర్శించారు. కాగితంపై నియామకాలు జరిగాయని, నిధులు పంపిణీ చేయబడ్డాయని, కానీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రారంభించినా, తన హయాంలోనే పూర్తి చేసేలా చూస్తోందని చెప్పారు.
ఢిల్లీలోని పంజాబీ, గ్రామీణ వర్గాల్లో బల్బీర్ సింగ్, సుఖ్బీర్ దలాల్కి మంచి పేరుందని సచ్దేవా ప్రశంసించారు. కేంద్రమంత్రి మల్హోత్రా మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఒకప్పుడు పార్టీ అవినీతికి వ్యతిరేకమని చెప్పేవారని, ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని వదిలేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేశారని, అందుకు ఆప్ నుంచి పలువురు నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!