BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్..బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్..
- బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్దేవా ఆయనను ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా నియమించారు.తాను ఎమ్మెల్యేగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించానని, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక కూడా వేయలేదని దలాల్ ఆరోపించారు. ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, ఆప్ తన అవినీతి నిరోధక హామీలకు దూరంగా ఉందని ఆరోపించారు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
Read Also: Jaya Bachchan: లోక్సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య
ఆప్ క్రీడా యూనివర్సిటీ గురించి తప్పుడు హామీలు ఇచ్చిందని సచ్దేవా విమర్శించారు. కాగితంపై నియామకాలు జరిగాయని, నిధులు పంపిణీ చేయబడ్డాయని, కానీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రారంభించినా, తన హయాంలోనే పూర్తి చేసేలా చూస్తోందని చెప్పారు.
ఢిల్లీలోని పంజాబీ, గ్రామీణ వర్గాల్లో బల్బీర్ సింగ్, సుఖ్బీర్ దలాల్కి మంచి పేరుందని సచ్దేవా ప్రశంసించారు. కేంద్రమంత్రి మల్హోత్రా మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఒకప్పుడు పార్టీ అవినీతికి వ్యతిరేకమని చెప్పేవారని, ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని వదిలేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేశారని, అందుకు ఆప్ నుంచి పలువురు నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!