Census: ఏప్రిల్1, 2026 నుంచి ప్రారంభం కానున్న జనాభా గణన.. ముందుగా ఇళ్ల లెక్కింపుతో షురూ..
- ఏప్రిల్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభం..
- ముందుగా దేశవ్యాప్తంగా ఇళ్ల గణనతో స్టార్ట్..
- రెండో దశలో జనాభా వివరాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Census: దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కింపు’’పై కేంద్రం చర్యల్ని వేగవంతం చేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లెక్కించి, జాబితా చేయనున్నారు. ఈ గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని, ఇది జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని భారత రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు. దీంట్లో గృహాల జాబితా కార్యకలాపాలు, గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. దీనికి ముందు పర్యవేక్షకులు, ఎన్యూమిరేటర్స్ నియామకం జరగనుంది. రాష్ట్రాలు, జిల్లా పరిపాలన సహకారంతో వీరికి పని విభజన జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Minister Nara Lokesh: “ఇంటింటికీ టీడీపీ”.. ప్రజాప్రతినిధులకు నారా లోకేష్ కీలక ఆదేశాలు..
జనాభా లెక్కింపు రెండు దశలుగా జరగనుంది. మొదటి దశలో గృహాల జాబితా ఆపరేషన్(HLO), ప్రతీ ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల వంటి వివరాలను సేకరిస్తారు. తర్వాత రెండో దశలో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి యొక్క జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక మరియు ఇతర వివరాలను సేకరించనున్నారు, ఇది ఫిబ్రవరి 1, 2027న జరగాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. జనాభా గణనలో, కుల గణన కూడా జరుగుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
జనాభా గణన కార్యకలాపాల కోసం, 34 లక్షలకు పైగా గణనదారులు మరియు పర్యవేక్షకులు మరియు సుమారు 1.3 లక్షల జనాభా గణన కార్యకర్తలను నియమించనున్నారు. ఇది 16వ జనాభా గణన అవుతుంది. స్వాతంత్య్రం తర్వాత ఇది 8వది. రాబోయే జనాభా గణనను మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తారు. స్వీయ గణనను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం ప్రజలను అడగడానికి దాదాపు 3 డజన్ల ప్రశ్నల్ని సిద్ధం చేసింది. ఈ సర్వేలో గృహాలను ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, కారు, జీప్, వ్యాన్), ఉపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వాటి గురించి అడుగుతారు. తాగు నీరు, లైటింగ్, మరుగుదొడ్లు, మురుగునీటి సౌకర్యాలు, వంటగది, ఎల్పీజీ కనెక్షన్ గురించి అడుగుతారు. ఇంటి ఫ్లోర్, పైకప్పుకు ఉపయోగించిన పదార్థాలు, దాని పరిస్థితి, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, వివాహ స్థితి, ఇంటి యజమాని స్త్రీ నా లేదా ఎస్సీ, ఎస్టీకి చెందిన వారా..? అనే అదనపు ప్రశ్నలు ఉంటాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?