Census: ఏప్రిల్1, 2026 నుంచి ప్రారంభం కానున్న జనాభా గణన.. ముందుగా ఇళ్ల లెక్కింపుతో షురూ..
- ఏప్రిల్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభం..
- ముందుగా దేశవ్యాప్తంగా ఇళ్ల గణనతో స్టార్ట్..
- రెండో దశలో జనాభా వివరాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Census: దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కింపు’’పై కేంద్రం చర్యల్ని వేగవంతం చేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లెక్కించి, జాబితా చేయనున్నారు. ఈ గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని, ఇది జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని భారత రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు. దీంట్లో గృహాల జాబితా కార్యకలాపాలు, గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. దీనికి ముందు పర్యవేక్షకులు, ఎన్యూమిరేటర్స్ నియామకం జరగనుంది. రాష్ట్రాలు, జిల్లా పరిపాలన సహకారంతో వీరికి పని విభజన జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
Read Also: Minister Nara Lokesh: “ఇంటింటికీ టీడీపీ”.. ప్రజాప్రతినిధులకు నారా లోకేష్ కీలక ఆదేశాలు..
జనాభా లెక్కింపు రెండు దశలుగా జరగనుంది. మొదటి దశలో గృహాల జాబితా ఆపరేషన్(HLO), ప్రతీ ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల వంటి వివరాలను సేకరిస్తారు. తర్వాత రెండో దశలో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి యొక్క జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక మరియు ఇతర వివరాలను సేకరించనున్నారు, ఇది ఫిబ్రవరి 1, 2027న జరగాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. జనాభా గణనలో, కుల గణన కూడా జరుగుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
జనాభా గణన కార్యకలాపాల కోసం, 34 లక్షలకు పైగా గణనదారులు మరియు పర్యవేక్షకులు మరియు సుమారు 1.3 లక్షల జనాభా గణన కార్యకర్తలను నియమించనున్నారు. ఇది 16వ జనాభా గణన అవుతుంది. స్వాతంత్య్రం తర్వాత ఇది 8వది. రాబోయే జనాభా గణనను మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తారు. స్వీయ గణనను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం ప్రజలను అడగడానికి దాదాపు 3 డజన్ల ప్రశ్నల్ని సిద్ధం చేసింది. ఈ సర్వేలో గృహాలను ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, కారు, జీప్, వ్యాన్), ఉపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వాటి గురించి అడుగుతారు. తాగు నీరు, లైటింగ్, మరుగుదొడ్లు, మురుగునీటి సౌకర్యాలు, వంటగది, ఎల్పీజీ కనెక్షన్ గురించి అడుగుతారు. ఇంటి ఫ్లోర్, పైకప్పుకు ఉపయోగించిన పదార్థాలు, దాని పరిస్థితి, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, వివాహ స్థితి, ఇంటి యజమాని స్త్రీ నా లేదా ఎస్సీ, ఎస్టీకి చెందిన వారా..? అనే అదనపు ప్రశ్నలు ఉంటాయి.
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..