ఒవైసీని చంపాలనే కాల్పులు.. అందుకే లేపేయాలనుకున్నా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు కలకలం సృష్టించాయి.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా.. ఆయన వాహనంపై కాల్పులు జరిపారు.. అయితే, ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు.. అంతా సురక్షితంగా బయటపడ్డారు.. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సచిన్ పండిత్ నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.. అసదుద్దీన్ ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు పండిట్ విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.
Read Also: బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న.. అసలు మీకు ఇష్టం ఉందా? లేదా..?
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
అసలు తాను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను కూడా నిందితుడు పోలీసులకు వెల్లడించినట్టుగా పోలీసులు తెలిపారు.. తాను పెద్ద రాజకీయ నేతను కావాలనుకున్నాను. కానీ, ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాన్న నిందితుడు.. అందుకే నా స్నేహితుడు శుభమ్తో కలిసి ఒవైసీ హత్య చేసుందుకు ప్లాన్ వేశానన్నారు.. అయితే, ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు కారులో ఆయన వంగిపోయారు.. దీంతో కాల్పులు కిందకు జరిపినట్టు చెప్పుకొచ్చిన ప్రధాని నిందితుడు సచిన్ పండిత్.. ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను.. అందుకే అక్కడి నుంచి పారిపోయానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక, ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్లాన్ తయారు చేశానని.. మరోవైపు.. ఒవైసీ కదలికలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడినని.. దాడి చేయడం కోసం గతంలో చాలా సందర్భాల్లో ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.. ఎంఐఎం చీఫ్ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలిసిందే.. ఆ విషయం తెలిసిన వెంటనే ముందే టోల్గేట్ వద్దకు చేరుకుని మాటు వేశామని.. ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపినట్టు కూడా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!