Living With Dead Body: ఇంట్లో ఏడాదిన్నరగా మృత దేహం..పెన్షన్ దరఖాస్తులో బయటపడ్డ భాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family living with dead body in kanpur: కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిన్నర క్రింతం ఇంట్లోనే అలానే ఉంచుకున్నారు కుటుంబ సభ్యులు. స్థానిక సమాచారంతో పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే భరించలేని దుర్యాసన. ఓ బెడ్ రూం నుంచి ఆవాసన వస్తుందని గమనించిన పోలీసులు అక్కడికి వెల్లి చూడగానే.. ఒక్కసారిగా ఖంగుతున్నారు. బెడ్ మీద మృదదేహం, బెడ్కి అతుక్కుపోయి వుండటం చూసి ఆశ్చర్య పోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి వారు ఇప్పటికి ఉన్నారా? అనే ప్రశ్నగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్ లోని రావత్పూర్ లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్ అనే వ్యక్తి 38 సంవత్సరాలు. అహ్మదాబాద్ లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. కాగా.. ఆయన 2021 ఏప్రిల్ 22న మరణించాడు. ఈనేపథ్యంలో.. విమలేశ్ మృతి చెందినా ఆవిషయాన్ని కుటుంబసభ్యులు బయటపెట్టలేదు. విమలేశ్ కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈనేపథ్యంలో.. విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది. భర్త చనిపోవడంతో.. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. దీంతో.. ఆదాయ పన్నుశాఖ, సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
అయితే.. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. ఈ.. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ లో.. ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఇక విమలేశ్ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. విమలేశ్ ఎముకల్లో మాంసం కూడా ఎండిపోయిందని తెలిపారు. విమలేశ్ మృతదేహాన్ని ఏడాదిన్నరగా ఎలా ఇంట్లో ఉంచుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా 2021లో అందరూ అల్లడుతూ వుంటే వీల్లు మాత్రం మృతదేహాన్ని ఎలా ఇంట్లో వుంచుకోవడమే కాకుండా.. ఏడాదిన్నరగా చనిపోయిన మనిషితో ఇంట్లో సావాసమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కుటుంబ సభ్యులను వైద్యులకు చూపించాలని, పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
कानपुर में डेढ़ साल से घर में रखे थे इनकम टैक्स अधिकारी का शव, परिवार मौत स्वीकारने को तैयार ही नहीं। कोरोना काल में हो चुकी थी अधिकारी की मौत pic.twitter.com/8HdoO5SBb2
— AYUSH TIWARI (@AYUSHTI10077811) September 23, 2022
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!