Living With Dead Body: ఇంట్లో ఏడాదిన్నరగా మృత దేహం..పెన్షన్ దరఖాస్తులో బయటపడ్డ భాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family living with dead body in kanpur: కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిన్నర క్రింతం ఇంట్లోనే అలానే ఉంచుకున్నారు కుటుంబ సభ్యులు. స్థానిక సమాచారంతో పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే భరించలేని దుర్యాసన. ఓ బెడ్ రూం నుంచి ఆవాసన వస్తుందని గమనించిన పోలీసులు అక్కడికి వెల్లి చూడగానే.. ఒక్కసారిగా ఖంగుతున్నారు. బెడ్ మీద మృదదేహం, బెడ్కి అతుక్కుపోయి వుండటం చూసి ఆశ్చర్య పోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి వారు ఇప్పటికి ఉన్నారా? అనే ప్రశ్నగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్ లోని రావత్పూర్ లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్ అనే వ్యక్తి 38 సంవత్సరాలు. అహ్మదాబాద్ లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. కాగా.. ఆయన 2021 ఏప్రిల్ 22న మరణించాడు. ఈనేపథ్యంలో.. విమలేశ్ మృతి చెందినా ఆవిషయాన్ని కుటుంబసభ్యులు బయటపెట్టలేదు. విమలేశ్ కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈనేపథ్యంలో.. విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది. భర్త చనిపోవడంతో.. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. దీంతో.. ఆదాయ పన్నుశాఖ, సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
అయితే.. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. ఈ.. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ లో.. ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఇక విమలేశ్ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. విమలేశ్ ఎముకల్లో మాంసం కూడా ఎండిపోయిందని తెలిపారు. విమలేశ్ మృతదేహాన్ని ఏడాదిన్నరగా ఎలా ఇంట్లో ఉంచుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా 2021లో అందరూ అల్లడుతూ వుంటే వీల్లు మాత్రం మృతదేహాన్ని ఎలా ఇంట్లో వుంచుకోవడమే కాకుండా.. ఏడాదిన్నరగా చనిపోయిన మనిషితో ఇంట్లో సావాసమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కుటుంబ సభ్యులను వైద్యులకు చూపించాలని, పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
कानपुर में डेढ़ साल से घर में रखे थे इनकम टैक्स अधिकारी का शव, परिवार मौत स्वीकारने को तैयार ही नहीं। कोरोना काल में हो चुकी थी अधिकारी की मौत pic.twitter.com/8HdoO5SBb2
— AYUSH TIWARI (@AYUSHTI10077811) September 23, 2022
తాజావార్తలు
-
Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
-
Toxic: యష్ ఇచ్చిన హింట్తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
-
E100 Flex-Fuel Car: పెట్రోల్ ఖర్చుకు గుడ్బై చెప్పే రోజులు దగ్గర్లోనే.. E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకొస్తున్న మారుతి
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?