Living With Dead Body: ఇంట్లో ఏడాదిన్నరగా మృత దేహం..పెన్షన్ దరఖాస్తులో బయటపడ్డ భాగోతం
Family living with dead body in kanpur: కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిన్నర క్రింతం ఇంట్లోనే అలానే ఉంచుకున్నారు కుటుంబ సభ్యులు. స్థానిక సమాచారంతో పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే భరించలేని దుర్యాసన. ఓ బెడ్ రూం నుంచి ఆవాసన వస్తుందని గమనించిన పోలీసులు అక్కడికి వెల్లి చూడగానే.. ఒక్కసారిగా ఖంగుతున్నారు. బెడ్ మీద మృదదేహం, బెడ్కి అతుక్కుపోయి వుండటం చూసి ఆశ్చర్య పోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి వారు ఇప్పటికి ఉన్నారా? అనే ప్రశ్నగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్ లోని రావత్పూర్ లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్ అనే వ్యక్తి 38 సంవత్సరాలు. అహ్మదాబాద్ లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. కాగా.. ఆయన 2021 ఏప్రిల్ 22న మరణించాడు. ఈనేపథ్యంలో.. విమలేశ్ మృతి చెందినా ఆవిషయాన్ని కుటుంబసభ్యులు బయటపెట్టలేదు. విమలేశ్ కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈనేపథ్యంలో.. విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది. భర్త చనిపోవడంతో.. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. దీంతో.. ఆదాయ పన్నుశాఖ, సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది.
Also Read
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
అయితే.. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. ఈ.. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ లో.. ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఇక విమలేశ్ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. విమలేశ్ ఎముకల్లో మాంసం కూడా ఎండిపోయిందని తెలిపారు. విమలేశ్ మృతదేహాన్ని ఏడాదిన్నరగా ఎలా ఇంట్లో ఉంచుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా 2021లో అందరూ అల్లడుతూ వుంటే వీల్లు మాత్రం మృతదేహాన్ని ఎలా ఇంట్లో వుంచుకోవడమే కాకుండా.. ఏడాదిన్నరగా చనిపోయిన మనిషితో ఇంట్లో సావాసమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కుటుంబ సభ్యులను వైద్యులకు చూపించాలని, పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
कानपुर में डेढ़ साल से घर में रखे थे इनकम टैक्स अधिकारी का शव, परिवार मौत स्वीकारने को तैयार ही नहीं। कोरोना काल में हो चुकी थी अधिकारी की मौत pic.twitter.com/8HdoO5SBb2
— AYUSH TIWARI (@AYUSHTI10077811) September 23, 2022
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!