గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు పట్టిపీడిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తాజాగా 3 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఇవి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా రూమ్ హీటర్ పేలి కుటుంబ సభ్యులు విగతజీవులుగా మారిపోయారు. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్గా పని చేస్తున్న కుటుంబం DMRC సిబ్బంది క్వార్టర్స్లో నివాసం ఉంటోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు రూమ్ హీటర్ ఆన్ చేసి నిద్రపోయారు. అయితే సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హీటర్ పేలి పోయింది. దీంతో రూమ్లోంచి పొగలు బయటకు వచ్చాయి. ఇరుగు పొరుగు వారు వెళ్లి చూడగా.. భర్త, భార్య, కుమార్తె చనిపోయి ఉన్నారు. నిద్రలోనే ముగ్గురు కూడా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Murder In Hyderabad: బోరబండలో కలకలం.. మాట్లాడటం లేదని యువతిని హత్య చేసిన యువకుడు
వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావించారు. రూమ్ హీటర్స్ ఉపయోగించే విషయంలో ముఖ్యమైన భద్రతా సమాచారాన్ని పాటించాలని పోలీసులు తెలిపారు.