ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ఓ వ్యక్తి వీడియో తీసి దంపతులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. ఆ వ్యక్తి చాలాసార్లు సివిల్ సర్వీస్ (PSC) పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ అతను బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాలను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
Read Also: MLA Rajasingh: అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి
ఈ మేరకు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి వాట్సాప్లో గుర్తు తెలియని కాల్ వచ్చింది. నిందితుడి వయస్సు 28 సంవత్సరాలు.. అతని పేరు వినయ్ కుమార్ సాహు. గత నెలలో.. అతను దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో దంపతుల ఇంటికి వెళ్ళాడు. అయితే అతను దొంగిలించకుండా.. తన మొబైల్ ఫోన్తో ప్రైవేట్ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ వారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో.. దంపతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జూన్ 25న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ధంధా) సంజయ్ పుంధీర్ తెలిపారు.
Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు
జూన్ 17న.. తన వాట్సాప్లో తెలియని నంబర్ నుండి వీడియో క్లిప్ వచ్చిందని.. తమ వ్యక్తిగత సంబంధ వీడియో అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి వెంటనే రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే తమ వీడియోను పబ్లిక్లో పెడతానని డిమాండ్ చేశారని భర్త పోలీసులకు చెప్పాడు. ఈ కేసును విచారించేందుకు పోలీసులు, యాంటీ క్రైమ్ అండ్ సైబర్ యూనిట్ (ఏసీసీయూ) సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సాహు అహివారా నివాసిగా గుర్తించారు. అతను.. ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్నాడు.