breaking: సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్, టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.. ఈ మధ్యే వయనాడ్లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా, ఈ నేపథ్యంలో సీపీఎం కార్యాలయంపై దాడి జరగడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. గత రాత్రి అధికార సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరినట్టు పోలీసులు చెబుతున్నారు. రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న ఏకేజీ సెంటర్పై రాత్రి 11.30 గంటల సమయంలో మోటర్బైక్పై వచ్చిన వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ(ఎం) నాయకులు ఇది బాంబుల దాడిగా ఆరోపించారు. ఏకేజీ భవన్లో బస చేసిన కొందరు పార్టీ నేతలు భవనం వెలుపల శక్తివంతమైన పేలుడు వినిపించినట్లు చెప్పారు.
Read Also: Rupee falls: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ..
Also Read
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
ఇక, అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాలను పరిశీలించారు. బాంబు స్క్వాడ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఏకేజీ సెంటర్లోని అధికారిక మీడియా గ్రూప్ ద్వారా సీపీఎం విడుదల చేసిన సీసీటీవీ విజువల్స్లో ఒక వ్యక్తి మోటర్బైక్పై ఘటనా స్థలానికి చేరుకుని భవనంపై “బాంబు” విసిరి అక్కడి నుండి పారిపోతున్నట్లు చూపించారు. పేలుడు పదార్థం ఏకేజీ సెంటర్లోని గోడకు తగిలింది.. అయితే, ఈ రెచ్చగొట్టే చర్య వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని.. సీపీఎం శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నేత, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ సూచించారు.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. మరోవైపు ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి సహా పలువురు కేరళ మంత్రులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నగరంలో పలువురు సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.. రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం తన నియోజకవర్గం వాయనాడ్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజావార్తలు
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!