Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాక్పై పేలుడు.. విచారణకు సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
ఆదివారం ఉదయం ఈ పేలుడు సమాచారం స్థానిక ప్రజల నుంచి అందిందని.. ట్రాక్ పై కొన్ని పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు పోలీస్ అధికారి అనిల్ కుమార్ విష్ణోయ్ వెల్లడించారు. పేలుడుకు బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డీజీపీ ఉమేష్ మిశ్రాను ఆదేశించారు.
Also Read
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Read Also: Thieves Molested Wife: దారుణం.. దొంగతనానికి వచ్చి, భర్త ముందే భార్యపై అత్యాచారం
అక్టోబర్ 31న అహ్మదాబాద్ లోని అసర్వా రైల్వే స్టేషన్ నుంచి అసర్వా-ఉదయ్ పూర్ ఎక్స్ప్రెస్ ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. సరిగ్గా ఈ రైలు వెళ్లే గంట ముందే ట్రాక్ పై ఈ పేలుడు సంభవించడం అనుమానాలకు తావిస్తోంది. పేలుడు సమాచారం తెలిసిన తర్వాత రైలును దుంగార్ పూర్ స్టేషన్ లో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. గనిలో ఉపయోగించే పేలుడు పదార్ధాలతో ట్రాకును దెబ్బతీయడానికి దుండగులు ప్రయత్నించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ కొన్ని చోట్ల విరిగిపోయిన నట్ బోల్టులు కనిపించలేదు. ఈ ఘటనపై రాష్ట్రపోలీసులతో పాటు రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
उदयपुर-अहमदाबाद रेल मार्ग के ओडा रेलवे पुल पर रेल पटरियों को नुकसान पहुंचाने की घटना चिंताजनक है। पुलिस व प्रशासन के वरिष्ठ अधिकारी मौके पर हैं। डीजी पुलिस को घटना की तह तक जाने के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) November 13, 2022
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!