Pragya Thakur: ఎంపీ విద్వేష ప్రసంగంపై లోక్సభ స్పీకర్కు మాజీ బ్యూరోక్రాట్ల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex Bureaucrats Slam BJP’s Pragya Thakur Over “Hindus, Keep Knives” Speech: ‘‘హిందువులు కత్తులను ఉంచుకోండి’’ అంటూ ఇటీవల ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (సాధ్వీ ప్రగ్యా) కర్ణాటకలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ 103 మంది మాజీ బ్యూరోక్రాట్లు లోక్ సభ స్పీకర్ కు బహిరంగ లేఖ రాశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లోక్ సభ నైతిక కమిటీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
READ ALSO: Good News: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
భోపాల్ బీజేపీ ఎంపీగా ఉన్న ప్రగ్యా ఠాకూర్, డిసెంబర్ 25న కర్ణాటక శివమొగ్గలో విద్వేష ప్రసంగం చేశారు. ముస్లింల పేరు చెప్పకుండా.. వారికి ‘జిహాద్’ సంప్రదాయం ఉంది. ఏమీ చేయలేకపోతే మన హిందూ బాలికలను ప్రలోభపరుచుకోవడానికి ‘‘లవ్ జిహాద్’’ చేస్తారని వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ కు పాల్పడే వారికి సమాధానం చెప్పండి, మన అమ్మాయిలను రక్షించండి, వారికి సరైన విలువలు నేర్పించండి.. మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోండి, కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా ఉంచుకోండి అంటూ ఓ హిందూ గ్రూపు సదస్సులో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఈ వ్యాఖ్యలపై 103 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. లేఖలో సంతకం చేసిన వారిలో మాజీ కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి, రాజస్థాన్ మాజీ సీఎస్ సలావుద్దీన్ అహ్మద్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మాజీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఎస్పీ ఆంబ్రోస్ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాదం చేసిన ప్రగ్యా ఠాకూర్ దాన్ని ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. లౌకికవాదం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా సమాజంలో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో రోజూవారీగా విషం చిమ్ముతున్నారని, సమాజంలో వారి స్థాయిని తగ్గించేలా ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను శివమొగ్గ పోలీసులు పట్టించుకోలేదని, ఆమెపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!