Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
- ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!
- 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధికారులతు తీవ్ర కసరత్తు చేస్తోంది. గత కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి భిన్నంగా పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. ఇక మద్యం తాగే వయసును కూడా కుదించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు 25 ఏళ్ల వయసు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదించే అవకాశం ఉంది. ఇకపై 21 ఏళ్లకే మద్యం సేవించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: గాజాపై ట్రంప్ ప్లాన్ను స్వాగతించిన పాక్.. మండిపడుతున్న స్వదేశీయులు
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
దాదాపు కొత్త లిక్కర్ పాలసీ సిద్ధమైనట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మద్యం తాగే వయసును తగ్గిస్తారా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ 21కు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీలపై నిషేధం ఎత్తేస్తారా? లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేనట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధానిలోని అన్ని రిటైల్ మద్యం దుకాణాల్లో ప్రీమియం మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడంపై కూడా చర్చ జరిగింది. కొత్త ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఒకే ధరలో విక్రయించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Stalin: కరూర్ను ఒకలా.. మణిపూర్ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
కొత్త లిక్కర్ పాలసీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీమియం బ్రాండ్లు అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా కస్టమర్లకు కొత్త బ్రాండ్లు కూడా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికి నెలలో ప్రణాళిక ప్రవేశపెట్టనున్నారు.
2021లో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం పాలసీ ప్రవేశపెట్టింది. అయితే రేఖా గుప్తా ప్రభుత్వం రాగానే కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో భారీ అక్రమాలు, అవినీతి చోటుచేసుకోవడంతో ఉపసంహరించుకున్నారు. ఇక ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు జైలు పాలయ్యారు.
తాజావార్తలు
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!