Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
- ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!
- 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధికారులతు తీవ్ర కసరత్తు చేస్తోంది. గత కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి భిన్నంగా పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. ఇక మద్యం తాగే వయసును కూడా కుదించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు 25 ఏళ్ల వయసు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదించే అవకాశం ఉంది. ఇకపై 21 ఏళ్లకే మద్యం సేవించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: గాజాపై ట్రంప్ ప్లాన్ను స్వాగతించిన పాక్.. మండిపడుతున్న స్వదేశీయులు
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
దాదాపు కొత్త లిక్కర్ పాలసీ సిద్ధమైనట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మద్యం తాగే వయసును తగ్గిస్తారా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ 21కు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీలపై నిషేధం ఎత్తేస్తారా? లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేనట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధానిలోని అన్ని రిటైల్ మద్యం దుకాణాల్లో ప్రీమియం మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడంపై కూడా చర్చ జరిగింది. కొత్త ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఒకే ధరలో విక్రయించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Stalin: కరూర్ను ఒకలా.. మణిపూర్ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
కొత్త లిక్కర్ పాలసీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీమియం బ్రాండ్లు అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా కస్టమర్లకు కొత్త బ్రాండ్లు కూడా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికి నెలలో ప్రణాళిక ప్రవేశపెట్టనున్నారు.
2021లో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం పాలసీ ప్రవేశపెట్టింది. అయితే రేఖా గుప్తా ప్రభుత్వం రాగానే కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో భారీ అక్రమాలు, అవినీతి చోటుచేసుకోవడంతో ఉపసంహరించుకున్నారు. ఇక ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు జైలు పాలయ్యారు.
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!