Delhi Floods: యమునా నది మహోగ్ర రూపం.. వెంటనే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని సీఎం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Floods: ఢిల్లీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యయునా నది మహోగ్ర రూపం దాల్చింది. 1978 తర్వాత రికార్డు స్థాయిలో 207.49 మీటర్ల గరిష్ట నీటిమట్టానికి యమునా నది చేరింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయాలని ప్రజలను సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
Read Also: Thalapathy Vijay : స్టార్ డైరెక్టర్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్న విజయ్ దళపతి..?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
మేము ప్రాణాలను, ఆస్తులను రక్షించాలి, యమునా నదికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2013 తర్వాత తొలిసారిగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటిందని, సాయంత్రం 4 గంటల సమయానికి 207.71 మీటర్లకు చేరుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) వరద పర్యవేక్షణ పోర్టల్ తెలిపింది.
యుమునా నదికి పెరుగుతున్న వరదను నివారించడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. గత రెండుమూడు రోజులుగా ఢిల్లీలో వర్షాలు కురవలేదని హిమచల్ ప్రదేశ్, హర్యానా నుంచి ఢిల్లీకి వరద నీరు చేరుతుందని ఆయన కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయమై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు తెలిపారు. సాధ్యమైతే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని నియంత్రిత పద్ధతిలో విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆయన ప్రతిపాదించారు. దేశ రాజధానిలో వరద వార్తలు ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇవ్వవని, ఢిల్లీ ప్రజలను ఈ పరిస్థితి నుంచి రక్షించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సూచించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..