Republic Day: ఈసారి రిపబ్లిక్ డేకు అతిథులుగా వచ్చేదెవరంటే..! భారత్ ఆహ్వానించింది వీళ్లనే!
- ఈయూ నాయకులకు భారత్ ఆహ్వానం
- జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలకు అతిథులు హాజరు
- ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ కలిస వేదిక పంచుకోనున్న అతిథులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు భారత ప్రభుత్వం విదేశీ ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్కు యూరోపియన్ యూనియన్ నాయకులను పిలిచినట్లుగా సమాచారం. యూరోపియన్ దేశాలతో భారత్ అది పెద్ద వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నాయకులను పిలిచినట్లుగా తెలుస్తోంది. జనవరి 27న వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు .. ఏకమైన మెయిటీ-కుకి బీజేపీ ఎమ్మెల్యేలు
Also Read
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
అమెరికా, చైనా తర్వాత యూరోపియన్తో మూడో అది పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని భారత్ చేసుకోబోతుంది. దీర్ఘకాలంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకోవడంతో జనవరి 27న సంతకాలు చేసుకోనున్నాయి. దీంతో భారతదేశం-యూరోపియన్ యూనియన్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. తొలుత భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్ర నాయకులు హాజరవుతారు. అనంతరం మరోసటి రోజు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నాయి.
ఇది కూడా చదవండి: H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్న్యూస్.. నేటి నుంచే..!
జనవరి 27న భారతదేశం -యూరోపియన్ యూనియన్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసుకోన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక సజీవ పత్రంగా ఉంటుందని ఇప్పటికే ఈయూ వర్గాలు తెలిపాయి. యూరోపియన్ యూనియన్తో భారత్ వాణిజ్యం సుమారు 136 బిలియన్ల వరకు ఉండనుంది. ఇది యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలువనుంది.
అతిథులు..
జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవ పరేడ్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పాల్గొంటారు. గణతంత్ర దినోత్సవం నాడు ఇద్దరు యూరోపియన్ నాయకులు, ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి వేదికను పంచుకోనున్నారు. భారత ఆహ్వానాన్ని ఇప్పటికే ఈయూ నాయకత్వం అంగీకరించింది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Prabhas : షూటింగ్కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
-
Rose Plant Care: గులాబీ మొక్కకు మొగ్గలు రావట్లేదా? ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే పూలతో నిండిపోతది
-
Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
-
Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!