S Jaishankar: పాకిస్తాన్తో చర్చలపై జైశంకర్ బిగ్ స్టేట్మెంట్..
- పాకిస్తాన్తో చర్చలు విషయంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- ఆ దేశంలో చర్చించే కాలం ముగిసింది..
- ఎలాంటి చర్యలకైనా భారత్ స్పందిస్తుందని వార్నింగ్..
- పాక్లో ఉగ్రవాదం పరిశ్రమగా మారిందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని ఆయన అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఈ వారంలో భారత్పై ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చే వారికి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
‘‘ ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంత వరకు, ఆర్టికల్ 370 పూర్తయింది. కాబట్టి, మేము పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాల గురించి ఆలోచించగలము అనేది సమస్య’’ అని ఈ విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో భారత్ వ్యవహరించే తీరులో నిష్క్రియంగా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. ‘‘నేను చెప్పదలుచుకున్నది ఏమిటంట, మనం నిష్క్రియంగా లేము, ఎదైనా సంఘటన ప్రతికూల లేదా సానుకూల దిశలో ఉన్నా కూడా మేము స్పందిస్తాము’’ అని అన్నారు.
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
పాకిస్తాన్తో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న జైశంకర్ మరోసారి తన వాడీవేడి మాటలతో ఆ దేశాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరిచే విషయంలో ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని చెప్పారు. ఉగ్రవాదం ఆ దేశంలో పరిశ్రమగా మారింది, అలాంటి బెదిరింపులని సహించేది లేదనేది భారతదేశ ప్రస్తుత మానసిక స్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే , బంగ్లాదేశ్లో పరిస్థితులు, ఆదేశంలో హిందువులపై టార్గెటెడ్ దాడులను ఆయన ప్రస్తావించారు. పొరుగుదేశాలు ఎప్పటికీ తికమక పెట్టేవే అని, ఏ పొరుగు దేశంలో సవాళ్లు లేవో చెప్పాలంటూ ఆయన పరస్పర ఆసక్తి, సహకారం ఆవశ్యకతని నొక్కి చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజుల మిగిలి ఉండటంతో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కీలక పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్సులు పాకిస్తాన్తో దౌత్యసంబంధాలు, చర్చల జరపాలని కోరుకుంటున్నాయి. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పాకిస్తాన్తో చర్చలు, వాణిజ్యం గురించి తన మానిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!