Olive Ridley Turtles: 33 ఏళ్ల తర్వాత ఒడిశా బీచ్లో కనిపించిన అంతరించిపోతున్న తాబేళ్లు..
- 33 ఏళ్ల తర్వాత ఒడిశా బీచ్లో కనిపించిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olive Ridley Turtles: అంతరించిపోతున్న అరుదైన ‘‘ఆలీవ్ రిడ్లీ’’ తాబేళ్లు కనిపించాయి. 33 ఏళ్ల తర్వాత ఒడిశాలోని బీచ్కి వచ్చాయి. సామూహిక గూడు కోసం ఒడిశాలోని గహిర్మాత సముద్ర అభయారణ్యంలోని ఎకాకులనాసి ద్వీపంలో కనిపించినట్లు ఒక అధికారి తెలిపారు. ‘‘ ఈ ద్వీపంలోని అందమైన బీచ్ సముద్ర కోతకు గురైంది. దీని ఫలితంగా బీచ్ ప్రొఫైల్ తగ్గింది. అయితే, 2020 నుంచి బీచ్ మళ్లీ స్థిరీకరణకు గురైంది. దీంతో బీచ్ ప్రస్తుతం పొడవుగా మారింది. ఇది తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనుకూలంగా మారింది’’ అని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మానస్ దాస్ అన్నారు. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు చివరిసారిగా 1992లో ఈ బీచ్లో కనిపించాయని, ఇప్పుడు 3 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చాయిన దాస్ అన్నారు.
Read Also: IND vs NZ Finals: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బౌలింగ్ చేయనున్న భారత్
Also Read
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ఇటీవల కాలంలో ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తాబేళ్ల సంరక్షణకు చాలా చర్యలు తీసుకుంది. గతంలో 4 కి.మీ పొడవనున్న ఏకాకులనాసి బీచ్, ఇప్పుడు సహజ అక్రెషన్ ప్రక్రియ తర్వాత 8 కి.మీ కు విస్తరించింది. గత రెండు రోజుల్లో 1.7 లక్షల తాబేళ్లకు ఈ బీచ్ ఆతిథ్యం ఇచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. నాసి-2 బీచ్ కాకుండా, ఈ బీచ్ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశంగా మారింది. నాసి-2 బీచ్లో 2.63 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి గుంతలు తవ్వాయి.
ఒడిశా తీరం వెంబడి ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతీ ఏడాది గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి. కేంద్రపారా జిల్లాలోని గహిర్మాత బీచ్ ఈ తాబేళ్లకు ప్రపంచంలోనే ఆతిథ్యం ఇచ్చే అతిపెద్ద బీచ్గా పేరు సంపాదించుకుంది. గహిర్మాత కాకుండా, ఈ తాబేళ్లు రుషికుల్య నది ముఖద్వారా, దేవీ నది ముఖద్వారం వద్ద సామూహిక గూడు కట్టుకోవడానికి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత, తాబేళ్లు సముద్ర జలాల్లోకి వెళ్తుంటాయి. 45-50 రోజుల తర్వాత ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!