End India bloc: కలిసి ఉండనప్పుడు కూటమి ఎందుకు?.. ఇండియా బ్లాక్పై ఒమర్ అబ్దుల్లా ఫైర్
- ఇండియా కూటమిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు..
- కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో తీవ్ర ఆగ్రహాం..
- కలిసి ఉండనప్పుడు ఇండియా కూటమి ఎందుకు అని ప్రశ్నించిన ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
End India bloc: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉండకపోతే కూటమికి ముగింపు పలకాలన్నారు. అయితే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమావేశం జరగకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పుడు ఈ కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?.. దీని అజెండా ఏంటి?.. అసలు కూటమి ఎలా ముందుకు కొనసాగుతుందని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.
Read Also: Relationship Tips : ఈ లక్షణాలు ఉన్న వారిని నమ్మకండి
Also Read
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ఇక, 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ రాకుండా చేసేందుకు శక్తికి మించి కృషి చేసిన ఇండియా కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు స్పష్టత లేకుండాపోయిందన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటామా, లేదా అనే విషయంపై స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సమావేశానికి సిద్ధంగా ఉండండి.. లేదంటే, లోక్సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడితే.. పొత్తుకు స్వస్తి చెప్పి.. ఇండియా కూటమిని మూసేయండి అని సూచించారు. అలాకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలంటే అందరం కలసికట్టుగా ముందుకు సాగాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.
Read Also: CM Chandrababu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఫైర్..
అయితే, త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుకు దూరంగా ఒంటరిగా బరిలోకి దిగాయి. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగుతుంది. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ కి ప్రాధాన్యత తగ్గిపోయిందని కూటమిలోని నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. కలిసి ఉండలేకపోతే కూటమిని మూసేస్తే మంచిదని కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..