BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేరళ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కే. సురేంద్రన్, రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలకు దిగారు. అటవీ ఏనుగుల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో..‘‘ వయనాడ్లో అటవీ ఏనుగు దాడి చేయడం వల్ల మరొకరు చనిపోయారు. మినీ ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కేరళలో ముఖ్యంగా వయనాడ్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణ పీడకలగా మారింది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also: K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
రాహుల్ గాంధీ వయనాడ్కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తున్నాయని సురేంద్రన్ విమర్శించారు. వయనాడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కేరళ సీఎం పనరయి విజయన్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ వయనాడ్కి తరుచుగా వెళ్లడంపై అధికార సీపీఎంతో పాటు బీజేపీ తీవ్రంగా విమర్శి్స్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిపై ఆయన స్పందించకపోవడంపై అక్కడి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఓట్లపైనే ఆసక్తి ఉందా..? అతను వయనాడ్కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులే పట్టణానికి ఎక్కువగా వచ్చాయని అన్నారు. అతడు ప్రజల ప్రాణాలపై ఉదాసీనంగా ఉన్నాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే పాలుపంచుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి ఆనందిస్తాడని, రాహుల్ గాంధీ ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని సురేంద్రన్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!