BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేరళ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కే. సురేంద్రన్, రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలకు దిగారు. అటవీ ఏనుగుల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో..‘‘ వయనాడ్లో అటవీ ఏనుగు దాడి చేయడం వల్ల మరొకరు చనిపోయారు. మినీ ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కేరళలో ముఖ్యంగా వయనాడ్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణ పీడకలగా మారింది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also: K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
రాహుల్ గాంధీ వయనాడ్కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తున్నాయని సురేంద్రన్ విమర్శించారు. వయనాడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కేరళ సీఎం పనరయి విజయన్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ వయనాడ్కి తరుచుగా వెళ్లడంపై అధికార సీపీఎంతో పాటు బీజేపీ తీవ్రంగా విమర్శి్స్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిపై ఆయన స్పందించకపోవడంపై అక్కడి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఓట్లపైనే ఆసక్తి ఉందా..? అతను వయనాడ్కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులే పట్టణానికి ఎక్కువగా వచ్చాయని అన్నారు. అతడు ప్రజల ప్రాణాలపై ఉదాసీనంగా ఉన్నాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే పాలుపంచుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి ఆనందిస్తాడని, రాహుల్ గాంధీ ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని సురేంద్రన్ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!