IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- ఎల్నినోపై భారత వాతావరణ శాఖ హెచ్చరిక
- ఎల్నినో అధికారికంగా ప్రారంభమైనట్లు వెల్లడి
- అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్నినోపై భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్నినో అధికారికంగా ప్రారంభమైందని.. వర్షాకాలంలో మరింత బలపడనుందని వార్నింగ్ ఇచ్చింది. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల కాలంలో ఈ ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఐఎండీ విడుదల చేసిన ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) బులెటిన్ ప్రకారం.. మధ్య, తూర్పు పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్నినో స్థాయిని దాటాయని.. అంతేకాకుండా సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు వాతావరణ వ్యవస్థ కూడా స్పందించడం ప్రారంభించిందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాల కాలంలో ఇవి మరింత బలపడే అవకాశం ఉంది.’’ అని ఐఎండీ తన బులెటిన్లో వెల్లడించింది.
Also Read
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
ఎల్నినోను అంచనా వేసే ప్రధాన సూచిక అయిన నినో 3.4 ఇండెక్స్ మూడు నెలల సగటు విలువ +0.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకుంది. దీంతో అధికారికంగా ఎల్నినో పరిస్థితులు ఏర్పడినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా పసిఫిక్ సముద్ర ఉపరితలం కింద కూడా విస్తృతంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ వేడి నీటి ప్రవాహాలు రాబోయే నెలల్లో పైకి రావడంతో ఎల్నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం జూన్-ఆగస్టు కాలంలో మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగనుంది. జూలై నుంచి మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్నినో పరిస్థితులు మాన్సూన్ సీజన్లో ఎక్కువ కాలం కొనసాగవచ్చని తెలిపింది.
నిరంతర పర్యవేక్షణ
పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని, మాన్సూన్ కాలంలో ప్రతి నెలా తాజా అంచనాలను విడుదల చేస్తామని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఎల్నినో బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Tags
- El-Nino
- imd warning
- Monsoon
- ocean
తాజావార్తలు
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
-
Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!