Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్
- ముంబై ఎయిర్పోర్టులో దిగి ఇంటికెళ్లిపోయిన డిప్యూటీ సీఎం
- వెంటనే సిబ్బందిని అలర్ట్ చేసిన షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఐఫోన్ను బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో మిస్ అయింది. లండన్ నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి పోయి ఇంటికెళ్లిపోయారు. అనంతరం సమాచారం అందించడంతో దాదాపు గంటపాటు సిబ్బంది గాలించిన తర్వాత దొరికింది. అనంతరం ఫోన్ను షిండేకు అప్పగించినట్లు ‘జనసత్తా’ నివేదించింది.
లండన్లో వారం రోజుల పర్యటించారు. పర్యటన ముగించుకుని షిండే ప్రయాణిస్తున్న విమానం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటలకు ముంబైలో ల్యాండ్ అయింది. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఐఫోన్ కనిపించడం లేదని గుర్తించారు. దీంతో వెంటనే ఆయన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్రిటిష్ ఎయిర్వేస్ భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకుని విమానంలో ఫోన్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఐఫోన్ విమానంలోనే ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంటపాటు సాగిన గాలింపు అనంతరం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫోన్ను షిండేకు తిరిగి అందించినట్లు సమాచారం.
Also Read
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
సెప్టెంబర్ 5న సన్నిహితులతో కలిసి ఏక్నాథ్ షిండే లండన్ వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు బ్రిటన్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయనకు మూడు సత్కారాలు కూడా లభించినట్లు సమాచారం. లండన్ పర్యటనలో భాగంగా క్రికెటర్ విరాట్ కోహ్లీని కూడా షిండే కలిశారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గతంలో నివసించిన ఇంటిని సందర్శించి అక్కడి స్మారకాన్ని పరిశీలించారు. ఇక లండన్లో వడాపావ్ తింటున్న షిండే ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏక్నాథ్ షిండే తరచుగా వీడియో కాల్స్ కోసం ఐఫోన్ను ఉపయోగిస్తారని, సమావేశాల సమయంలో అప్పుడప్పుడు తన వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ను ఇస్తుంటారని ‘జనసత్తా’ పేర్కొంది. గతంలోనూ ఆయన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్న ఘటన జరిగినట్లు నివేదిక తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన ఓ ఫోన్ను పోగొట్టుకోగా, అనంతరం అది తిరిగి లభించినట్లు పేర్కొంది.
- Tags
- eknath shinde
- iphone
- London
తాజావార్తలు
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!