Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
- కేరళ రాజకీయాల్లో హైడ్రామా
- సీపీఐ(ఎం) కార్యకర్తల తీవ్ర నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinarayi Vijayan: కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. కన్నూర్లోని ఆయన నివాసంలో తనిఖీలు ముగించుకుని బయటకు వస్తున్న ఈడీ అధికారులను సీపీఐ(ఎం) కార్యకర్తలు అడ్డుకోవడంతో విజయన్ నివాసం వద్ద హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది.
గేటు వద్ద ఉద్రిక్తత..
ఈడీ సోదాలు ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పార్టీ కార్యకర్తలు గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడ కాసేపు తోపులాట, గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటకుండా చూసేందుకు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, స్థానిక పదాధికారులు రంగంలోకి దిగి, కార్యకర్తలను శాంతింపజేసి అధికారులను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు ఈడీ అధికారుల వాహనాలపై రాళ్లు వేశారు.
Also Read
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
- ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
- Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
ఇది రాజకీయ కక్షసాధింపే
పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడిని సీపీఐ(ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం, ఈడీ లక్ష్యంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ చర్య పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. “దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేశారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కేసుల్లో ట్రయల్ కోర్టులు వారికి ఊరటనివ్వడం చూశాం. కేరళలో జరుగుతున్న ఈడీ సోదాలు కూడా బీజేపీ – ఆర్ఎస్ఎస్ల రాజకీయ వ్యూహంలో భాగమే” అని అన్నారు.
ఈడీ ఇప్పుడు స్వతంత్ర సంస్థ కాదు
ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థలా పనిచేయడం లేదని, అది పూర్తిగా “ఆర్ఎస్ఎస్ – బీజేపీ ప్రభుత్వ రాజకీయ యంత్రాంగం” గా మారిపోయిందని బేబి మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈడీ చర్యతో కేరళం వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజాస్వామ్య సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందంటూ సీపీఐ(ఎం) కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగారు.
తాజావార్తలు
-
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
-
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్పై ఆసక్తికర విశ్లేషణ!
-
Curry Leaves Storage Tips: ఈ సులభమైన చిట్కా.. కరివేపాకు నెలల తరబడి తాజాగా ఉంటుంది..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!