Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9గా నమోదైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పోర్ట్బ్లెయిర్కు సమీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. పోర్ట్బ్లెయిర్కు ఈశాన్యంగా 126 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. సముద్ర ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.53 నిమిషాలకు భూకంపం చోటుచేసుకున్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా అండమాన్, నికోబార్ దీవుల పరిసరాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అండమాన్తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, దీనికి సమాంతరంగా పాకిస్థాన్లోనూ ఈ ఉదయం భూకంపం వచ్చినట్టు ఎన్సీఎస్ పేర్కొంది. ఇది రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదయినట్టు వివరించారు.
Read also: Maruti Baleno Price 2023: రూ 1.5 లక్షలు చెల్లించి.. మారుతి బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి!
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
శుక్రవారం ఉదయం ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లోనూ రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సియాంజ్ జిల్లాలోని పంజిన్కు ఉత్తరంగా 220 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం మాత్రం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇండియా, బర్మా ప్లేట్ సమీపంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు క్రియాశీలక భూకంపాల జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్లేట్లు తరుచూ కదులుతుండటంతో భూకంపాలు సాధారణంగా చోటుచేసుకుంటాయి. ఇదే ఒక్కోసారి సునామీలకు కారణమవుతుంటాయి. 2004లో వచ్చిన భూకంపం.. అండమాన్ నికోబార్ దీవులను అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా సునామీ సంభవించి 10 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే భూకంప నిరోధక మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో భూకంపాల ప్రమాదాన్ని తగ్గించే దిశలో ప్రభుత్వం చురుకుగా పని చేస్తోంది. విపత్తు సంసిద్ధత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి చేపడుతోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!