Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9గా నమోదైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పోర్ట్బ్లెయిర్కు సమీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. పోర్ట్బ్లెయిర్కు ఈశాన్యంగా 126 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. సముద్ర ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.53 నిమిషాలకు భూకంపం చోటుచేసుకున్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా అండమాన్, నికోబార్ దీవుల పరిసరాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అండమాన్తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, దీనికి సమాంతరంగా పాకిస్థాన్లోనూ ఈ ఉదయం భూకంపం వచ్చినట్టు ఎన్సీఎస్ పేర్కొంది. ఇది రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదయినట్టు వివరించారు.
Read also: Maruti Baleno Price 2023: రూ 1.5 లక్షలు చెల్లించి.. మారుతి బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి!
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
శుక్రవారం ఉదయం ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లోనూ రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సియాంజ్ జిల్లాలోని పంజిన్కు ఉత్తరంగా 220 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం మాత్రం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇండియా, బర్మా ప్లేట్ సమీపంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు క్రియాశీలక భూకంపాల జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్లేట్లు తరుచూ కదులుతుండటంతో భూకంపాలు సాధారణంగా చోటుచేసుకుంటాయి. ఇదే ఒక్కోసారి సునామీలకు కారణమవుతుంటాయి. 2004లో వచ్చిన భూకంపం.. అండమాన్ నికోబార్ దీవులను అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా సునామీ సంభవించి 10 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే భూకంప నిరోధక మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో భూకంపాల ప్రమాదాన్ని తగ్గించే దిశలో ప్రభుత్వం చురుకుగా పని చేస్తోంది. విపత్తు సంసిద్ధత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి చేపడుతోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!