Drug Smuggling: చెన్నైలో “వీడొక్కడే” సీన్.. ముంబైలో పట్టుబడిన డ్రగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug seizure at Mumbai and Chennai airports: అంతర్జాతీయ విమానాశ్రాయాలు, పోర్టులు డ్రగ్స్ అక్రమ రవాణాకు కేరాఫ్ గా మారుతున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి భారత్ లోకి డ్రగ్స్ తీసుకువస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు డ్రగ్స్ ను ఇండియాలోకి తీసుకువస్తున్నారు. తాజాగా గురువారం రోజు చెన్నై, ముంబై ఎయిర్ పోర్టుల్లో డ్రగ్స్ తీసుకువస్తున్న ఆఫ్రికా జాతీయులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై విమానాశ్రయంలో ఏకంగా ‘ వీడొక్కడే ’ సినిమా సీన్ రిపీట్ అయింది. సినిమాలో డ్రగ్స్ ను క్యాప్సుల్స్ లో పెట్టి కడుపులో దాచిన సన్నివేశం ఉంటుంది. సరిగ్గా అలాగే టాాంజానియా నుంచి వస్తున్న వ్యక్తి కడుపులో రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్ కనుగొన్నారు. మొత్తం 86 క్యాప్సుళ్లను కడుపులో దాచాడు. చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా కడుపులో ఉన్న డ్రగ్స్ గుట్టు తెలిసింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Tamil Nadu: తమిళనాడులో 22 చోట్ల ఎన్ఐఏ దాడులు.. ఎల్టీటీఈ పునరుద్ధరణకు మాఫియా ప్రయత్నం
ఇదే విధంగా ముంబైలో ఉగాండా జాతీయుడి పట్టుబడ్డాడు. ముంబై పోలీస్, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉగండా జాతీయుడి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఒక కిలో మెథాక్వలోన్ డ్రగ్ ను గుర్తించారు. చెన్నైలో లాగా ఇక్కడ కూడా డ్రగ్స్ ను నిందితుడు శరీరంలో దాచి పెట్టాడు. అతన్ని జేజే ఆసుపత్రికి తీసుకెళ్లి డ్రగ్స్ బయటకు తీశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు పంజాబ్ అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన భారతీయుడి వద్ద నుంచి రూ. 49.27 లక్షల విలువైన 933.2 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బ్యాగేజీలో దాచిపెట్టిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..