1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లష్కర్ తోయిబా ఉగ్ర సంస్థ బాంబు తయారీదారు అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నేడు నిర్దోషిగా ప్రకటించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత గడిచి సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో పలు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, తుండాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొన్న కోర్టు, ఇద్దరు నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్లను దోషులుగా నిర్ధారించి వారికి జీవిత ఖైదు విధించింది.
ప్రస్తుతం 80 ఏళ్ల తుండా 1996 బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఇతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తుండా అనేక బాంబు పేలుళ్లలో నిందితుడిగా ఉన్నాడు. అండర్ వరల్డ్ డాన్, ముంబై వరస పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంకి సన్నిహితుడిగా పేరున్న తుండా బాంబు తయారీలో నిష్ణాతుడు. ఇతడిని ‘‘డాక్టర్ బాంబ్’’ అని పిలిచేవారు.
Also Read
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
Read Also: Lishi Missing: మా చెల్లి మిస్సింగ్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
1993లో కోట, కాన్పూర్, సికింద్రాబాద్, సూరత్ మీదుగా వెళ్లే రైళ్లలో పేలుళ్లు జరిగాయి. బాంబే పేలుళ్లు జరిగిన నెల రోజుల తర్వాత రైలు బాంబు పేలుళ్లతో దేశం మరోసారి ఉలిక్కిపడింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. అయితే, తాజాగా తుండాను నిర్దోషిగా ప్రకటించడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సమాచారం.
తుండా తన 40 ఏట ఉగ్రవాదం వైపు మళ్లాడు. 1993 ముంబై వరస పేలుళ్ల తర్వాత అతను నిఘా వర్గాల స్కానర్ కిందకు వచ్చాడు. బాంబుల తయారీలో ఎక్స్ఫర్ట్ అయిన అతను, బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించడంతో ఎడమ చేతిని కోల్పోయాడు. లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైష్-ఎ-మహ్మద్ మరియు బబ్బర్ ఖల్సాతో సహా పలు ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేశాడు. 2013లో భారత్- నేపాల్ సరిహద్దు సమీపంలోని ఉత్తరాఖండ్ బన్బసాలో అరెస్టయ్యాడు. నాలుగేళ్ల తర్వాత, 1996లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో హర్యానా కోర్టు తుండాకు జీవితఖైదు విధించింది.
తాజావార్తలు
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!