Site icon NTV Telugu

Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 సీట్లు గెలుస్తుందా.? మమతా సవాల్..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: బీజేపీని గద్దె దించాలని, ప్రధాని నరేంద్రమోడీకి అధికారాన్ని దూరం చేయాలని ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండియా కూటమి’ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల కాలంలో కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే కూటమితో జతకట్టారు. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ పార్టీలు కాంగ్రెస్‌తో సీట్లను పంచుకోమని తెగేసి చెప్పాయి.

Read Also: Vijay: హీరో విజయ్ కొత్త పార్టీపై అన్నాడీఎంకే కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే, తాజాగా బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు విబేధాల తర్వాత ఆమె ఆ పార్టీపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు అయినా గెలుచుకుంటుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.

బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో బెనర్జీ మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ 300 సీట్లలో 40 సీట్లు గెలుస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకు అంత అహంకారం.? మీరు బెంగాల్ వచ్చారు. మనం ఇండియా కూటమిలో ఉన్నాము, కనీసం నాకు చెప్పంది. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి. మీరు గతంలో గెలిచిన చోట్ల ఓడిపోతారు.’’ అని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క స్థానం లేదు, రాజస్థాన్‌లో మీరు గెలవలేదు, వెళ్లి ఆ సీట్లు గెలవండి, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను, వారణాసి, అలహాబాద్‌‌లో గెలవాలని, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను అని ఆమె సవాల్ విసిరారు.

Exit mobile version